కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ వాసుల గుండెల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంపైన ఈ మహమ్మారి తన ప్రభావాన్ని చాటుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలను తీసుకుంది, వ్యాధి వ్యాప్తి చెందకుండా వుండేందుకు ప్రజలకు పలు సూచనలను చేశారు. ఇదే సమయంలో విద్యాసంస్థలకు, జనసామర్థ్యం అధికంగా వుంటే షాపింగ్ మాల్స్, ధీయేటర్లు, అన్ని ఈ నెల 31 వరకు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పాటు ఈ వైరస్ పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా వుండాలని పరిశుభ్రతను నిత్యం పాటించాలని, ఎవరితోనూ కలవకూడదని కూడా హెచ్చరించింది.
అటు సామాజికి మాద్యంమాలతో పాటు ఇటు మీడియా, దినపత్రికలలోనూ ప్రకటనత ద్వారా.. ప్రజలు పాటించాల్సిన సూచనలు జారీ చేసింది. ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చింది. ఈ క్రమంలో అత్యవసర సర్వీసులు చేస్తున్న ప్రజలతో పాటు డెలివరీ బాయిస్, ఫుడ్ డెలివరీ సర్వీసులు, ఇతర ముఖ్యసర్వీసులలో పాల్గోనేవారు రోడ్లపై తిరుగుతూనే వున్నారు. ఈ క్రమంలో రోడ్లపై తిరుగుతూ ఇళ్లకు చేరుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అటు కార్యాలయాలు, హోటల్లలో తినేవారు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పలు సూచనలు జారీ చేసింది ప్రభుత్వం.
అయితే ఈ విషయమై ప్రజలను ప్రభుత్వం ఎంత ప్రకటనలు జారీ చేసినా.. ప్రత్యక్షంగా చూపడం ద్వారా మరింత అధికంగా జాగ్రత్తలు పాటించేందుకు రోడ్లపై తిరుగుతున్న వారికి పోలీస్ శాఖ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలను చైతన్యపరిచారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగి ఉన్న సమయంలో ‘కరోనా’ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేశారు. కొత్తపేట సర్కిల్ పరిధిలో వాహనదారులకు ‘కరోనా’పై పోలీసులు పలు సూచనలు చేశారు.
#RachakondaTrafficPolice sensitising commuters on the precautions to be taken to ward off #coronavirus at Kothapet circle. pic.twitter.com/wixVLS1H8n
— Rachakonda Police (@RachakondaCop) March 19, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more