ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలకు వేసిన రంగుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పంచాయితీ భవనాలకు, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలకు, ప్రభుత్వ భవనాలకు సాధారణ రంగులను మాత్రమే వేయాలని.. ప్రభుత్వాన్ని అదేశించింది హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నిర్ణయం ప్రకారం ఇవాళ్టి నుంచి పది రోజుల వ్యవధిలో మళ్లీ సాధారణ రంగలు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయస్థానం జారీ చేసిన అదేశాలను అమలు పర్చినట్లుగా రంగులు మార్చివేసిన తరువాత వాటికి ఆధారాలను కూడా చూపుతూ న్యాయస్థానంలో నివేదికను అందజేయాలని అదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీని అదేశింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సూచించింది. వైసీపీ జెండా రంగు తరహాలో రంగులు వేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. పంచాయితీ ఎన్నికలు నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వరకు అటు స్థానిక సంస్థలు ఎన్నికలన్నింటినీ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం అదేశాలు జారీచేసింది.
గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, వాటర్ ట్యాంకులకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more