జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటినలో వున్నారు. దేశరాజధానిలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొనున్న ఆయన సదస్సులో ఉపన్యసించనున్నారు. ఈ మేరకు వచ్చిన ఆహ్వానాన్ని మన్నించిన ఆయన హస్తిన పర్యటనలో బిబీగా వున్నారు. కాగా ఈ ఉదయం పవన్ కల్యాన్ కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల చెక్కును అందజేశారు. గతంలో తాను ఈ విరాళాన్ని అందజేయాలని అనుకున్నా ఇవాళ కుదరడంతో అందజేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ''ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే' సందర్భంగా సైనికులకు ఏం చేయగలనని అనుకున్నాను. దేశం కోసం తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా పెట్టిన మహనీయుల కుటుంబాల సంక్షేమానికి ఏదైనా చేయాలని తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా ఇద్దామని అనుకున్నానని తెలిపారు. ఇటీవల కొన్నిసార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇద్దామనుకున్నాను. అయితే అప్పుడు కుదరలేదు.. ఇప్పుడొచ్చి ఇచ్చాను. ఇదే సందర్భంగా ఆయన జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు.
కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయల చెక్కును అందజేసిన జనసేనాని @PawanKalyan (2) pic.twitter.com/F2jaMTNnGB
— JanaSena Party (@JanaSenaParty) February 20, 2020
ఎవరైనా ఈ సైనిక బోర్డుకు తమ వంతు సాయాన్ని అందించవచ్చునని.. ప్రతీ ఒక్కరూ తమ వంతుగా సాయం అందిచాలని పవన్ పిలుపునిచ్చారు. 'ఢిల్లీలో రాజకీయ నేతలను ఎవరినైనా కలుస్తానా? లేదా? అన్న విషయంపై ఏమీ చెప్పలేను.. నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పారు. ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొనాలని తనకు ఆహ్వానమందిందని తెలిపారు. కాగా, కాసేపట్లో విజ్ఞాన్ భవన్కు వెళ్లి ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more