ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మరోమారు అమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ నెల 7న ఈ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ మాత్రం ఇక్కడ గతం కన్నా మెరుగ్గా రెండో స్థానాన్ని అక్రమిస్తుందని, అయితే ఢిల్లీలోని అధికార పార్టీకి రెండో పార్టీకి మధ్య పోటీ అన్నది ఓ విధంగా లేదనే చెప్పాలని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఢిల్లీ ఫీఠాన్ని మూడు పర్యాయాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కొనసాగుతున్న సభలో ప్రతినిథ్యమే కరువైంది. కాగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కూడా ఖాతా తెరిచే అవకాశాలు వున్నాయని సర్వే సంస్థ ప్రకటించింది.
ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే గోవా తరహా రాష్ట్ర హోదాను ఇస్తామని గత ఎన్నికలకు ముందు హామీని ఇచ్చిన బీజేపి.. కేవలం రాజకీయంగానే పావులు కదుపుతుందని, ప్రజలపై పెద్దగా ప్రేమను కనబర్చడం లేదని, ఇక వారి సమస్యల పరిష్కారంలో పెద్దగా చోరవ కూడా చూపడం లేదని, దీనికి తోడు ఢిల్లీలో శాంతిభద్రలు కూడా క్షీణించడానికి బీజేపి అనుసరిస్తున్న విధానాలే కారణమని అక్కడి ఓటర్ల నాడి వుందని తెలుస్తోంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా ఓటు వేసిన ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి కేజ్రీవాల్ నాయకత్వానికే మొగ్గుచూపుతున్నారని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
గత ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ సారి కూడా కాస్తా మెజారిటీ తగ్గినా.. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మోజార్టీ సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఢిల్లీలో ఎన్నికల్లో మోదీ ఆకర్షణ, అమిత్ షా వ్యూహాలు ఎంతమాత్రమూ పనిచేయబోవని హైదరాబాద్ కు చెందిన ఈ సంస్థ సర్వే తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఢిల్లీలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.1500 నుంచి రూ.3000 వేలకు ఆదా చేయగలుగుతోందని పేర్కొంది.
ఢిల్లీలో విశ్వసనీయత గల నేత లేకపోవడం కూడా బీజేపీకి నష్టం చేసే అంశాల్లో ఒకటని సర్వే తెలిపింది. షీలాదీక్షిత్ మరణంతో కాంగ్రెస్ కోలుకోలేకపోతోందని, ఎన్నార్సీ, సీఏఏలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్కు మారిందని సర్వే స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ ఎన్నికలలో బీజేపి రెండో స్థానంలో కొనసాగే అవకాశాలు వున్నాయని, కాగా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలదొక్కుకునే అవకాశాలు కూడా వున్నాయని తెలిపింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో గత ఎన్నికలలో అమ్ అద్మీ పార్టీ ఏకంగా 67 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more