Minor girl sexually assaulted in Hyderabad పంజాగుట్టలో దారుణం.. మైనర్ బాలికపై పది రోజులుగా..

Minor girl sexually assaulted by neighbour in hyderabad

minor girl, neighbour, rape, sexual assault, Crime against girl child, POSCO Act, Jahangir, MS Maqtha, Panjagutta Police Station, CP Anjan kumar, Hyderabad Police, Telangana, Crime

A minor girl allegedly raped by a 30-year-old neighbour under Panjagutta police station limits. According to police, the victim girl's family is residing in MS Maqtha and her parents are daily wage workers.

రాజధాని నగరంలో దారుణం.. మైనర్ బాలికపై పది రోజులుగా..

Posted: 01/29/2020 01:38 PM IST
Minor girl sexually assaulted by neighbour in hyderabad

నిర్భయ కేసులోని దోషులకు ఉరికంబం ఎక్కాల్సిన సమయం ఆసన్నమవుతున్న సందర్భంతో వారు భయంతో శిక్షను తప్పించుకునేందుకు శతమార్గాలను అన్వేషిస్తున్న ఉదంతం దేశ ప్రజలందరికీ కనిస్తున్నా.. మరోవైపు తెలంగాణలోని సంచలనం రేపిన దిశఘటనలో నిందితులను పోలీసులు మట్టుబెట్టినా.. కామాంధులకు మాత్రం ఇంకా వెన్నులో భయం అలుముకోవడం లేదు. అభం శుభం తెలియని అమాయక చిన్నారులకు ఆశచూపి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే వున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే నమోదు చేసుకుంది.

వ్యవసాయం శాపంగా మారి.. పల్లెల్లో బతుకు బారమై.. ఏదో ఒకటి చేసి పోట్టపోసుకుందామని నగరానికి వచ్చిన సగటు కుటుంబం.. తమ బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలని కష్టపడుతోంది. అయితే ఆ చిన్నారి బంగారు భవిష్యత్తును.. తమ పొరుగింట్లోనే వున్న మానవమృగం చిదిమేస్తుందని తెలియక.. బిడ్డను వదిలేసి భార్యభర్తలిద్దరూ కూలీ పనుల కోసం వెళ్లారు. అంతే తమ బిడ్డపై ఘోరం జరిగిపోయిందని తెలుసుకున్న వారు గుండెలవిసేలా ధ:ఖించారు. ఇంటి పక్కనే నివాసమంటున్న క్రూరమృగంపై పోలీసులకు పిర్యాదు చేశారు.

పంజాగుట్ట పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. పోలీసుల కథనం ప్రకారం ఇలా వున్నాయి.. పంజాగుట్ట పరిధిలోని ఎంఎస్ మక్తా ప్రాంతంలో నివాసం వుంటుందీ బాధిత కుటుంబం. బాధితురాలి తండ్రి వాచ్ మన్ గా పని చేస్తుండగా.. తల్లి ఇళ్లల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిందితుడు జహంగీర్ వారు నివసిస్తున్న ఇంటి పక్కనే ఉంటూ స్థానికంగా పంక్చర్‌ షాపు నడిపిస్తున్నాడు. పక్కింట్లో వుండే 13 ఏళ్ల బాలికపై జహంగీర్‌ కన్నుపడింది.

మంగళవారం సాయంత్రం  తల్లిదండ్రులు లేని సమయంలో జహంగీర్‌ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసరికి నీరసంగా కూర్చున్న తన కూతుర్ని చూసి ఏమైందని తల్లి ఆరా తీయగా.. సదరు బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది. గత పది రోజులుగా ఇలాగే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని వివరించింది.  దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles