నిర్భయ కేసులోని దోషులకు ఉరికంబం ఎక్కాల్సిన సమయం ఆసన్నమవుతున్న సందర్భంతో వారు భయంతో శిక్షను తప్పించుకునేందుకు శతమార్గాలను అన్వేషిస్తున్న ఉదంతం దేశ ప్రజలందరికీ కనిస్తున్నా.. మరోవైపు తెలంగాణలోని సంచలనం రేపిన దిశఘటనలో నిందితులను పోలీసులు మట్టుబెట్టినా.. కామాంధులకు మాత్రం ఇంకా వెన్నులో భయం అలుముకోవడం లేదు. అభం శుభం తెలియని అమాయక చిన్నారులకు ఆశచూపి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే వున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే నమోదు చేసుకుంది.
వ్యవసాయం శాపంగా మారి.. పల్లెల్లో బతుకు బారమై.. ఏదో ఒకటి చేసి పోట్టపోసుకుందామని నగరానికి వచ్చిన సగటు కుటుంబం.. తమ బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలని కష్టపడుతోంది. అయితే ఆ చిన్నారి బంగారు భవిష్యత్తును.. తమ పొరుగింట్లోనే వున్న మానవమృగం చిదిమేస్తుందని తెలియక.. బిడ్డను వదిలేసి భార్యభర్తలిద్దరూ కూలీ పనుల కోసం వెళ్లారు. అంతే తమ బిడ్డపై ఘోరం జరిగిపోయిందని తెలుసుకున్న వారు గుండెలవిసేలా ధ:ఖించారు. ఇంటి పక్కనే నివాసమంటున్న క్రూరమృగంపై పోలీసులకు పిర్యాదు చేశారు.
పంజాగుట్ట పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. పోలీసుల కథనం ప్రకారం ఇలా వున్నాయి.. పంజాగుట్ట పరిధిలోని ఎంఎస్ మక్తా ప్రాంతంలో నివాసం వుంటుందీ బాధిత కుటుంబం. బాధితురాలి తండ్రి వాచ్ మన్ గా పని చేస్తుండగా.. తల్లి ఇళ్లల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిందితుడు జహంగీర్ వారు నివసిస్తున్న ఇంటి పక్కనే ఉంటూ స్థానికంగా పంక్చర్ షాపు నడిపిస్తున్నాడు. పక్కింట్లో వుండే 13 ఏళ్ల బాలికపై జహంగీర్ కన్నుపడింది.
మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు లేని సమయంలో జహంగీర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసరికి నీరసంగా కూర్చున్న తన కూతుర్ని చూసి ఏమైందని తల్లి ఆరా తీయగా.. సదరు బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పింది. గత పది రోజులుగా ఇలాగే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని వివరించింది. దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more