మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మాజీ సర్పంచ్ ను గ్రామప్రజలు దేహశుద్ది చేసిన ఘటన ఇది. తాత వయస్సున మానవమృగం మనవరాలి వయస్సు వున్న బాలికపై అఘాయిత్యానికి యత్నించడంతో బాలిక బంధువులు చావచితకకొట్టారు. అభం శుభం తెలియని 12ఏళ్ల అమాయక బాలికపై 63 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఉరికి తండ్రిలా కాపాడుకోవాల్సిన హోదాను వెలగబెట్టిన ఘనుడు చేసిన నిర్వాకానికి ఊరంతా తలోచెయి వేసి సన్మానించింది.
మండల పరిధి గ్రామంలో ఓ బాలిక తన తండ్రికి ఫోన్ చేసేందుకు మాజీ సర్పంచి కేతిరెడ్డి కోటిరెడ్డి(63) ఇంటికి వెళ్లింది. తండ్రితో ఫోన్లో మాట్లాడాక మిరపకాయలు తీసుకొని రమ్మని కోటిరెడ్డి బాలికకు చెప్పాడు. ఆమె వాటిని తీసుకొని తిరిగి అతని ఇంటికి వెళ్తుండగా గదిలోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాసేపటి బాలిక తల్లి ఇంటికి రాగా కుమార్తె కనిపించలేదు. అదే సమయంలో కోటిరెడ్డి ఇంటి నుంచి బాలిక అమ్మా అంటూ కేకలు వేయడంతో అక్కడికి వెళ్లింది. బాలిక రోదిస్తూ జరిగినదంతా తల్లికి వివరించింది. ఆగ్రహించిన బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు కోటిరెడ్డిని పట్టుకుని చితకబాదారు.
దీంతో ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని గదిలో దాక్కున్న నిందితుడ్ని గ్రామస్థులు బయటకు లాగి దాడిచేశారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం గ్రామీణ, రఘునాథపాలెం, కూసుమంచి ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన నిందితుడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మం గ్రామీణ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అంజలి ముదిగొండ పీఎస్కు చేరుకుని బాలిక, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలిక చెప్పిన వాంగ్మూలం తీసుకుని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కోటిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more