షిరిడీ సాయిబాబా జన్మస్థలం విషయంలో తలెత్తిన వివాదంపై షిరిడీ పట్టణంలో కొనసాగుతున్న బంద్ ను మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల నేపథ్యంలో స్థానికులు ఉపసంహరించుకున్నారు. షిరిడి సాయిబాబు సంస్థాన్ ట్రస్ట్ కు చెందిన పలువురితో పాటు షిరిడీలోని 40 మంది పెద్దలతో కలసి ముంబైలో ఈవిషయమై ప్రభుత్వం చర్చించింది. ఈ క్రమంలో షిరిడీ సాయి జన్మస్థలం ఫథ్రీ అని తామకుతాముగా చెప్పలేదని.. ఎవరో చరిత్రకారులు తెలిపిన విషయాన్ని మాత్రమే తాము ప్రస్తావించామని ప్రభుత్వం సంస్థాన్ సభ్యులకు తెలిపింది.
ఇకపై సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని పేర్కొనబోమని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. షిరిడీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి బాలాసాహెబ్ తోరట్, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరేతో పాటుగా షిరిడి సాయిసంస్థాన్ ట్రస్ట్ సీఈఓ డీఎం ముగ్లీకర్ సహా 40 మంది ప్రతినిధులు ఈ భేటీలో సమావేశమయ్యారు. సాయి జన్మస్థలంపై తాను చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉపసంహరించుకున్నారు.
రాష్ట్రంలో తాము ఏ ప్రాంత అభివృద్దికీ వ్యతిరేకం కాదని అయితే సాయి జన్మస్థలం అంటూ చేస్తున్న ప్రచారంతోనే ఇబ్బందని సంస్థాన్ సభ్యులు తమ అవేదనను వ్యక్తంచేశారు. అనంతరం శివసేన నేత కమలాకర్ కోతే మాట్లాడుతూ.. షిరిడీ సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని ఇకపై పేర్కొనరాదని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో కొత్త వివాదాలకు చోటు లేదని, ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని స్పష్టం చేశారు. సీఎంతో చర్చలపై సంతృప్తి చెందినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సమావేశాలకు హాజరైన బీజేపి నేత రాధాకృష్ణ విక్కే పాటిల్ కూడా ముఖ్యమంత్రి, మంత్రులతో జరిగిన చర్చలపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో షిరిడి బంద్ పిలుపును ఉపసంహరించుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more