తమ సొంతపార్టీ కార్యకర్తల చేతిలో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మెన్ ఆర్కే రోజాకు పరాభవం ఎదురైంది. అమె వెళ్తున్న కారును నిలిపి సమస్యలను చెప్పేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలను పార్టీ నాయకులు అడ్డుకోవడంతో వారంతా అగ్రహానికి గురై అమె వెళ్తున్న కారును ఘెరావ్ చేశారు. కారును ముందుకు కదలనీయకుండా చుట్టుముట్టారు. ఈ క్రమంలో కొందరు అమెపై విమర్శలు చేశారు. ఎన్నికల ముగిసాయి కాబట్టి తమను పట్టించుకోవడం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టగా.. అమె అక్కడి నుంచి వెళ్లారు.
కాగా, రోజా అనుచరులు ఆమెను అడ్డగించిన కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్ పురంలో చోటుచేసుకుంది. రోజాను రానివ్వకుండా నిన్న సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ నాయకులను పట్టించుకోకుండా టీడీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పుత్తూరులోని పోలీస్ స్టేషన్లో రోజా అనుచరులు ఈ రోజు ఫిర్యాదు చేశారు.
పర్యవసానంగా హరీష్, సంపత్, సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తి అనే కార్యకర్తలతో పాటు 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై 143,341,427,506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. కేబీఆర్పురంలో సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో దాడి చేశారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more