తమ సొంతపార్టీ కార్యకర్తల చేతిలో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మెన్ ఆర్కే రోజాకు పరాభవం ఎదురైంది. అమె వెళ్తున్న కారును నిలిపి సమస్యలను చెప్పేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలను పార్టీ నాయకులు అడ్డుకోవడంతో వారంతా అగ్రహానికి గురై అమె వెళ్తున్న కారును ఘెరావ్ చేశారు. కారును ముందుకు కదలనీయకుండా చుట్టుముట్టారు. ఈ క్రమంలో కొందరు అమెపై విమర్శలు చేశారు. ఎన్నికల ముగిసాయి కాబట్టి తమను పట్టించుకోవడం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టగా.. అమె అక్కడి నుంచి వెళ్లారు.
కాగా, రోజా అనుచరులు ఆమెను అడ్డగించిన కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్ పురంలో చోటుచేసుకుంది. రోజాను రానివ్వకుండా నిన్న సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ నాయకులను పట్టించుకోకుండా టీడీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పుత్తూరులోని పోలీస్ స్టేషన్లో రోజా అనుచరులు ఈ రోజు ఫిర్యాదు చేశారు.
పర్యవసానంగా హరీష్, సంపత్, సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తి అనే కార్యకర్తలతో పాటు 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై 143,341,427,506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. కేబీఆర్పురంలో సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో దాడి చేశారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు.
(And get your daily news straight to your inbox)
Feb 26 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ... Read more
Feb 26 | యావత్ దేశం ఇంధన ధరల పెంపుపై భగ్గుమంటోంది. ప్రజలను ఇంధన ధరల పెంపుపై పెదవి విరుస్తుండగా, ఈ ధరాఘాతాన్ని విపక్షాలు తమ తమ స్థాయిలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై అస్త్రాలుగా సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో... Read more
Feb 26 | మీరు దేశీయంగా విమానయానం చేయలనుకుంటున్నారా.? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు చెక్ ఇన్ లగేజ్ లేకుండా దేశీయంగా విమానాల్లో ప్రయాణిస్తే.. మీ ప్రయాణం టికెట్ ధరపై రాయితీని పోందే అవకాశం లభిస్తోంది. ఔనా... Read more
Feb 26 | ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పడిన పోరపచ్చాలు తొలగిపోవడంతో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెనువెంటనే మున్సిపల్ ఎన్నికలకు నగరా మ్రోగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీంతో రాష్ట్రంలో... Read more
Feb 26 | తెలుగురాష్ట్రాల్లో పెనుసంచలనంగా మారిన న్యాయవాద దంపతుల దారుణ హత్యకేసులో కీలక నిందితులను తప్పించారని కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టపగలు రాహదారిపై అత్యంత పాశవికంగా న్యాయవాద దంపతుల హత్యలకు పాల్పడటానికి అసలు... Read more