ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో గత పద్దెనిమిది రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఓ రైతు కుటుంబంలో విషాదాన్ని నింపింది. సకల జనుల సమ్మెలో భాగంగా 17వ రోజున మందడంలో పోలీసులు మహిళలు, రైతులపై దౌర్జన్యం చేశారని ఇవాళ అమరావతి బంద్ కు పిలుపునివ్వగా, ఆ పిలుపులో పాల్గోనేందుకు సిద్దం కావాలన్న రైతు ఇవాళ అసువులు బాసాడు.
అమరావతి పరిసర గ్రామాల్లోని రైతులతో కలసి నిన్న సకలజనుల సమ్మెలో పాల్గోన్న రైతు.. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తామన్న సంకేతాలు వెలువడిన నాటి నుంచి కొంత అందోళనకరంగానే వున్నాడని.. తనకున్న పోలాన్ని ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన రైతు అప్పటి నుంచి చురుగ్గా నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ వాటిలో పాల్గోన్నాడని స్థానికులు తెలిపారు. కాగా ఇవాళ ఆయన తీవ్రమైన మానసిక అందోళనకు గురైన ఆయన గుండెపోటుతో మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అప్పటి ప్రభుత్వం రాజధాని కోసం చేసిన ల్యాండ్ పూలింగ్కి సదరు రైతు 10 ఎకరాలు ఇచ్చినట్టు సమాచారం. రాజధాని తమ ప్రాంతం నుంచి తరిలిపోతోందన్న భయంతో.. గత 17 రోజులుగా జరుగుతోన్న ఆందోళనల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రైతు మృతితో తుళ్లూరు మండల రైతులు, మహిళలు కాసేపు మౌనం పాటించారు. కాగా రైతు మృతికి గవర్నమెంట్ బాధ్యత వహించాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more