ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి వికేంద్రీకరించి మూడు ప్రాంతాలలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామన్న సంకేతాలను ఇచ్చిన నేపథ్యంలో నిరసనలను వ్యక్తం చేస్తున్న రాజధాని ప్రాంతాలలో పర్యటించి.. ఆక్కడి రైతులను పరామర్శిస్తూ వెళ్తున్న పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా.. మందడం సమీపంలో పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను నేరుగా తుళ్లూరు వెళ్లాలని పోలీసులు సూచించారు.
మందడం మీదుగా మంగళగిరికి వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడానికి వీళ్లేదంటూ ఆంక్షలు విధించారు. అంతేకాదు పవన్ కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక రైతులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దాదాపు 200 మంది పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచె వేసి, పొక్లెయిన్ అడ్డుగా పెట్టి కాన్వాయ్ ముందుకెళ్లకుండా చేశారు.
దీంతో పోలీసుల వేసిన ఇనుప కంచెలను జనసేన కార్యకర్తలు, రైతులు తొలగించి పవన్ పర్యటను ముందుకు సాగాలే దోహదపడ్డారు. అయితే పోలీసుల చర్యలతో ఆగ్రహానికి గురైన పవన్ కల్యాన్.. కారు దిగి కాలినడకన మందడం గ్రామానికి బయలుదేరారు. దీంతో ఆయన వెంట నడిచిన అభిమానులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగు కిలోమీటర్ల దూరం కూడా తాను కాలినడకనే వెళ్తానని చెప్పిన పవన్ కల్యాణ్ తనను ఎవరు అడ్డుకుంటారో.. ఎలాంటి ఆంక్షలు విధిస్తారో చూస్తానని కూడా సవాల్ చేశారు.
పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో జరిగిన రైతుల పోరాటం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. అలాగే అమరావతి రైతుల అంశం కూడా చాలా పెద్ద సమస్యేనని పేర్కోన్న ఆయన ఈ విషయం కూడా దేశంలోని రైతులందరీకీ తెలియాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కాగా, పవన్ ను అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న రాజధాని ప్రాంత రైతులు వెంకటపాలెం చెక్పోస్టు వద్దకు భారీగా తరలివచ్చారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
చెక్ పోస్టు వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో మందడం మీదుగా సీఎం వెళ్లాల్సి ఉందని, సీఎం వెళ్లే వరకు వేచి చూడాలని పోలీసులు పవన్ కు సూచించారు. పోలీసుల సూచనమేరకు పవన్ అక్కడే వేచి ఉన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు, రైతులు నినానాదాలు చేశారు. రహదారికి అడ్డంగా కంచె వేయడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more