ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సీడ్ క్యాపిటల్ గా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో గత 13 రోజులుగా నిరసనలు, అందోళనలు చేస్తున్న రాజధాని రైతులను అరెస్టు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు చర్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. పోలీసులు కూడా కొంత విజ్ఞతతో ఆలోచించాలని సూచనలు చేశారు. రాజధాని నిర్మాణ క్రమంలో సర్వం త్యాజించిన రైతులకు అండగా నిలిచి.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారికి త్యాగానికి కటకటాల శిక్షను నిరతిగా ఇస్తుందా.? అంటూ మండిపడ్డారు.
రాజధాని కోసం ఆందోళన చేస్తున్న వాళ్లపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులపై హత్యాయత్నం కింద అభియోగాలను నమోదు చేయడాన్ని తప్పుబట్టిన ఆయన పోలీసులు కూడా రాజధాని రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ప్రకటన నేపథ్యంలో జరిగిన ఘటనలకు పోలీసులు రైతులపై పెట్టిన సెక్షన్లకు పొంతన వుందా.? అంటూ ఫైర్ అయ్యారు. అర్థరాత్రి ఇళ్ల ప్రహరిగోడలు దూకి రైతులను అరెస్టు చేస్తారా.? అంటూ ప్రశ్నించారు.
రైతులను గుండాలు, దొంగల మాదిరిగా పరిగణిస్తారా.? వారి కుటుంబాల్లోని మహిళలు, వృద్దులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం.? ఈ క్రమంలో వారి కుటుంబాలు చెందిన భాయందోళనకు ఏ ప్రభుత్వం, ఏ పోలీసులు తీర్చగలరంటూ మండిపడ్డారు. 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి అందించిన రైతులను పెయిడ్ అరిస్టులంటూ అవమానించింది చాలక.. అరెస్టులతో అందోళనను అరికట్టాలని చూస్తారా..? అందుకనే వారిపై హత్యాయత్నం సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారా.? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం, వెలగపూడికి చెందిన ఆరుగురు రైతులను మీడియాపై దాడి కేసులో అరెస్టు చేసిన పోలీసులు వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. రైతులను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిడంతో విచారించిన న్యాయస్థానం రైతులపై పెట్టిన హత్యాయత్నం సెక్షన్లు సరికాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో హత్యాయత్నానికి ఆధారాలు ఏమున్నాయని పోలీసులను ప్రశ్నించింది. తక్షణం హత్యాయత్నం అభియోగాలకు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాలని అదేశించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రైతులపై హత్యాయత్నం కేసును సెక్షన్లను 373గా మార్చారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more