కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో వున్న ఆయన 106 రోజుల తరువాత బెయిల్ లభించడంతో బయటకు వచ్చిన ఆయన వచ్చీ రాగనే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అపకారికి కూడా ఉపకారం చేయడం తమ విధానమని.. కక్షసాధింపు రాజకీయాలు తాము చేయబోమని అన్నారు. అయితే ఎవరు ఈ విధానాలను అవలంబిస్తున్నారో కూడా దేశ ప్రజలందరికీ తెలుసునని పరోక్షంగా మోడీ సర్కారుపై విమర్శలు చేశారు.
బీజేపి ప్రభుత్వహయాంలో కేంద్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, అర్థిక వ్యవస్థను కేంద్రం కుప్పకూల్చిందని ఆయన అన్నారు. ఇది ఆర్థిక మాంద్యం కాదని తమకు తెలుసునని, అయినా.. ఇంత నత్తనడకన ఆర్థిక వృద్ది సాగడమెందుకు జరుగుతొందని ఆయన ప్రశ్నించారు. ఇక నెమ్మదిస్తున్న ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ఎన్నడూ నోరు విప్పరని ఆయన దుయ్యబట్టారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశానో అందరికీ తెలుసని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.
దేశంలో ఉల్లి ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. ప్రజలకు బీజేపీ నేతలు చాలా హామీలిచ్చారని, వాటి గురించి పట్టించుకోవట్లేదని ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వ తిరోగమన ఆర్థిక విధానాలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని అన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, మూకదాడులు దేశంలో శాంతిభద్రతలను సైతం ప్రశ్నించేలా మారుతున్నాయని అన్నారు. మన అడపడచులపై ఇలా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఒక్క రోజునే ఇలాంటి ఆరు ఘటనలు తన దృష్టికి వచ్చాయని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
WATCH: P Chidambaram addresses the media in Delhi https://t.co/Vj2aR8CmPR
— ANI (@ANI) December 5, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more