మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులకు ఫుల్ స్టాప్ పడటం లేదు. బీజేపికి తగిన సంఖ్యాబలం వుంటే వెంటనే బలనిరూపణ చేసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణమాలకు మించి ఇక ఏమీ లేవు ప్రభుత్వ ఏర్పాటు తప్ప అని భావిస్తున్న తరుణంలో మరోమారు అన్యూహ పరిణామాలే ఎదురవుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తిరిగి శరద్ పవార్ గూటికి వచ్చేసిన అజిత్ పవార్ మరోమారు కూటమివర్గాలకు షాక్ ఇస్తున్నారా.? అంటే ఔననే చెప్పాలి.
ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి ఆయన ఫోన్ అందుబాటులో లేదు. ఉపముఖ్యమంత్రి పదవిని త్యజించి వచ్చినా.. మళ్లీ అదే పదవి ఆయనకు దక్కుతున్న తరుణంలో అనూహ్యంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇక ఇదే సమయంలో ఆయన సొంత నియోజకవర్గం బారామతిలో వెలసిన పోస్టర్లు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన నియోజకవర్గంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి వద్దని, ఏకంగా సీఎం పదవినే చేపట్టాలని పోస్టర్లు వెలిసాయి. బావి ముఖ్యమంత్రి అజిత్ పవారేనంటూ పోస్టర్లు వెలిశాయి. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైన వేళ అజిత్ ఫోన్ స్విచ్ఛాప్ చేసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.
ఇక దీనిపై స్పందించిన ఎన్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. అజిత్ ప్రస్తుతం తమకు అందుబాటులోనే ఉన్నారని, సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారని తెలిపారు. తరచూ కాల్స్ వస్తుండటంతో ఫోన్ స్విచ్చాప్ చేశారని క్లారిటీ ఇచ్చారు. అటు అజిత్ సొంత నియోజకవర్గమైన బారామతిలో భావి ముఖ్యమంత్రి అజిత్ పవారేనంటూ ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేసిన పోస్టర్ల విషయమై అడిగిన ప్రశ్నకు అభిమానులు తమ ప్రియమైన నేతలకు ఉన్నతమైన పదవులు రావాలని.. ఆశిస్తుంటారని.. ఆకాంక్షిస్తుంటారని ఇందులో విచిత్రమేముందని ఆయన తిరిగి ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కూటమి పార్టీలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల మధ్య పదవుల పంపకంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశముందని తెలుస్తోంది. పదవుల పంపకంలో భాగంగా ఎన్సీపీకి డిప్యూటీ చీఫ్ మినిష్టర్, కాంగ్రెస్కు స్పీకర్ పదవులు ఖరారైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి స్పీకర్ పృథ్వీరాజ్ చౌహాన్, ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారని కూటమి వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more