తన ఖాతాలోకి నెలనెలా డబ్బులు వచ్చిపడుతుంటే.. మొదట్లో కాసింత ఆశ్చర్యానికి గురైనా.. తరువాత తేరుకుని వాటిని ఎంచక్కా తీసుకుని తన అవసరాలను తీర్చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసి అటు బ్యాంకు అధికారులు.. విచారిస్తే.. ఔను తన ఖాతాలోని డబ్బులు వచ్చాయి. వాటిని ఎన్నికల హామీలో భాగంగా ప్రధాని మోడీ వేశాడనుకున్నాను. అందుకనే నా అవసరాలకు వాడుకున్నాను అంటూ సమాధానమిచ్చాడు.
ఈ విచిత్రాన్ని చూస్తున్న స్థానికులు మాత్రం సొమ్మెకడిది.. సోకోకడిది అన్న చిత్రాన్ని చూసినట్లు వుందని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే బ్యాంకు అధికారులు చేసిన తప్పుకు ఖాతాదారుడి పరువు పోయేలా కథనాలు ప్రచురించడం సహేతుకం కాదన్న వారూవున్నారు. దీంతో ఏమీ సేతురా.. అంటూ బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు వాళ్లకెందుకు ఇంత టెన్షన్.. అసలు డబ్బులు వేసిందెవరు.? ఆ ఖాతా ఆ వ్యక్తికి చెందినదేనా.? అన్న ప్రశ్నలు మీ మదిని తొలుస్తున్నాయి కదూ.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఒకే పేరుతో ఇద్దరు ఖాతాదారులు వుండటం.. వారిద్దరూ ఓకే బ్యాంకుకు చెందిన శాఖలో ఖాతాను తెరవడం.. అది కూడా రమారమి ఒకే సమయంలో తెరవడం.. అసలు కారణంగా తెలుస్తోంది. అదెలా అంటే.. రురై గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్, రోనీ గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్ ఇద్దరూ భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఒకే శాఖలో ఖాతా తెరిచారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో బ్యాంకు అధికారులు పొరపాటున ఇద్దరికీ ఒకటే ఖాతా నంబరు కేటాయించారు.
ఇక్కడే బ్యాంకు అధికారులు అసలు పోరబాటుకు తెరలేపారు. ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్ బ్యాంకులో దాచుకుంటున్న డబ్బులు మరో హుకుమ్ సింగ్ ఖాతాలో జమ అవుతున్నాయి. తన ఖాతాలోకి వస్తున్న డబ్బును చూసిన హుకుమ్ సింగ్.. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని సంబరపడ్డాడు. ఎప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకుని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అలా ఆరు నెలల కాలంలో మొత్తం 89 వేల రూపాయలు డ్రా చేసి తన అవసరాలకు వాడేసుకున్నాడు.
ఇటీవల డబ్బులు అవసరం రావడంతో తాను దాచుకున్న డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా, అందులో లక్ష పైచిలుకు డబ్బులకు బదులుగా కేవలం రూ.35 వేలు మాత్రమే ఉండటం గమనించి నిర్ఘాంతపోయాడు. వెంటనే విషయాన్ని బ్యాంకు అధికారులు దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటికి గానీ చేసిన పొరపాటును బ్యాంకు అధికారులు గుర్తించలేదు. తీరా ఇలా జరగడానికి కారణమైన మరో హుకుమ్ సింగ్ ను పిలిచి.. ‘డబ్బులు డ్రా చేసింది నీవేనా.. ఆ డబ్బలు మీ అకౌంట్లోకి ఎలా వచ్చాయని అనుకున్నావు’ అని విచారించారు.
బ్యాంకు అధికారుల ప్రశ్నలన్నింటినీ విని అన్నింటికీ తలూపిన హుకుమ్ సింగ్.. తాను చెప్పిన సమాధానం విన్న తరువాత ఏం చేయాలో బ్యాంకు అధికారులకు పాలుపోలేదు. ఇది దొంగతనం కిందకు వస్తుంది.. మీది కాని డబ్బు మీ అకౌంట్లోకి వస్తే బ్యాంకు అధికారులకు తెలియజేయాలే తప్ప.. వాటిని వాడుకోకూడదని తెలియదా అన్న బ్యాంకు అధికారుల ప్రశలకు అమయాకంగా అతనేం చెప్పాడంటే.. తనకేమీ తెలియదని.. నల్లధనాన్ని ప్రజల ఖాతాల్లో వేస్తానని మోదీ.. ఇచ్చిన హామీ ప్రకారం వేస్తున్నాడని అనుకున్నా.. ఇన్నాళ్లు లేని విధంగా ఇప్పుడే తన ఖాతాలోకి డబ్బులు అందుకే వస్తున్నాయని అనుకున్నాని చెప్పాడంతో అధికారులు తెల్లబోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more