భారత టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి అనతికాలంలోనే దేశంలో అత్యధిక మంది కస్టమర్లను కలిగిన సంస్థగా సంచలనాలకు తెరతీసీన రిలయస్ జియో నెట్ వర్క్.. తాజాగా తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేయడంతో పాటు.. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు చేస్తామని ప్రకటించింది. నిమిషానికి 6 పైసలు చెల్లించాలని చెప్పింది. దీంతో షాక్ గురైన కస్టమర్లు.. రిలయన్స్ మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన జియో నెట్ వర్క్ ప్రారంభించే సమయంలో వాయిస్ కాల్స్ కు ఎలాంటి చార్జీలు తీసుకోబోమని, కేవలం డాటాకు మాత్రమే డబ్బులు తీసుకుంటమని, రిలయన్స్ నుంచి ఏ ఇతర నెట్ వర్క్ కు ఫోన్ చేసినా అంతా ఉచితమేనని కూడా సంచలన ఆఫర్ తో కస్లమర్లను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. కస్టమర్ల సంఖ్య రిత్యా ఏకంగా దేశంలో నెంబర్ వన్ స్థానంలోకి ఎకబాకిన తరువాత ప్లేటు ఫిరాయించింది. ఇకపై చార్జీలు వసూలు చేస్తామని, కొత్త ఐయూసీ ప్లాన్లు కూడా తీసుకొచ్చింది. వీటితో ఉచితంగా డేటా ఇస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది.
రిలయన్స్ జియో ప్రకటనతో కస్టమర్లు షాక్ లో వుండగా ఎలాంటి అందోళనా చెందవద్దని, ఇతర నెట్ వర్క్ సంస్థలు రిలయన్స్ జియో కస్టమర్లకు గాలం వేస్తున్నాయి. రిలయన్స్ జియో ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే వోడాఫోన్ ఐడియా స్పందించింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసే కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. జియోలా తాము ఐయూసీ ఛార్జీలు వేయమని స్పష్టం చేసింది.
అంతేకాదు రిలయన్స్ మాట తప్పిన విధానంతో పాటు అసలు ఐయూసీ చార్జీలు అంటే ఏంటో.. ఎవరు నిర్ణయిస్తారన్న విషయాలను కూడా కస్టమర్లకు తెలిపే ప్రయత్నం చేసి.. రిలయన్స్ జియో సంస్థను దోషిగా నిలబట్టే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు తాము రిలయన్స్ సంస్థ మాదిరిగా మాట తప్పమని కూడా భరోసా కల్పిస్తుంది. ఐయూసీ ఛార్జీలు అనేవి మొబైల్ కంపెనీలు తమలో తాము తేల్చుకోవాల్సిన విషయమని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని ఐడియా-వోడాఫోన్ తెలిపింది.
ఐయూసీ ఛార్జీలను కవర్ చేయడానికి.. ఇతర సర్వీసు ప్రొవైడర్లకు చేసిన కాల్స్ కోసం.. వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో చేసిన ప్రకటన తొందరపాటు చర్య అని వొడాఫోన్-ఐడియా ప్రతినిధులు చెప్పారు. ఇంటర్ కనెక్ట్ మధ్య ఇది పరిష్కారం తీసుకురాలేదన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన రెగ్యులేటరీ డెఫినిషన్ ప్రకారం ఐయూసీ ఛార్జీలు అనేది మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాల్సిన విషయం అని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని, వారు ఆందోళన చెందాల్సిన విషయం కాదని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more