ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర ఆయన స్వగృహమైన కోట నుంచి బయలుదేరింది. రెండు కిలోమీటర్ల దూరంలో వున్న స్వర్ణపురిలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కిలోమీటరు దూరం పాటు ఆయన అంతిమయాత్ర సాగనుంది. ఈ అంతమయాత్రంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నేతలు నారా లోకేష్, బాలకృష్ణ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, దేవినేని ఉమ, నారాయణ, సహా పలువురు అగ్రనేతలు అంతిమయాత్రలో నడుస్తూ పాల్గోన్నారు.
నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెలకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో భాగంగా సాగిన అంతిమయాత్రంలో అటు కోడెలఅంతిమయాత్ర వాహనంపై స్థానికులు పూల వర్షం కురిపించారు. ఆయనతో పాటు యాత్ర ముందర నడిచిన చంద్రబాబుపై కూడా పూల వర్షం కురిపించారు, కిలోమీటరు దూరం వరకు సాగిన ఈ యాత్రలో వేలాదిగా టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గోనడంతో రెండు గంటలు సాగుతుందని భావించిన యాత్రం ఏకంగా మూడు గంటలకు పైగా సాగుతుందని అధికారులు, పోలీసులు భావిస్తున్నారు.
కోడెల అంతిమయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడెల నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కోడెల శివప్రసాదరావుకు సంతాపం తెలుపుతూ నరసరావుపేట పట్టణంలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణంలో బంద్ పాటించనున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది. తమ ప్రియనేత ఆకస్మిక మరణంతో దు:ఖసాగరంలో మునిగిన అభిమానులు నరసరావుపేటకు తరలివచ్చారు,
కడసారి చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోడెల సేవలను గుర్తు చేసుకుంటున్నారు. నరసరావుపేట అభివృద్ధి ఆయన చలవేనంటూ గుర్తుచేసుకుంటున్నారు. కోడెల లాంటి నాయకుడు మళ్లీ రాలేడని చెబుతున్నారు. నరసరావుపేటకు నీటి కొరత లేకుండా చేసిన గొప్పనాయకుడని కితాబిస్తున్నారు. పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కోటప్పకొండను ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎనలేనిదంటూ కోడెల సేవలను స్మరించుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more