ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు బౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత శాఖలకు అదేశాలను జారీ చేశారు. రాష్ట్ర హోం మంత్రిగా, ఇరిగేషన్ శాఖ, వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా సేవలు అందించి చివరగా అంధ్రప్రదేశ్ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆయనకు అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది.
కోడెల మరణం వెనక రాజకీయకక్షలు ఉన్నాయన్నది టీడీపీ వర్గాల వాదన. మానసిక వేదన భరించలేక ఆయన సూసైడ్ చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల ఆత్మహత్యపై టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ఇంతకీ కోడెలది ఎలాంటి మరణం అన్నది పోలీసులు ఇవాళ స్పష్టం చేయనున్నారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం... కోడెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇంట్లో టిఫిన్ చేసి... 10.10కి బెడ్రూంకి వెళ్లి ఫ్యాన్కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు.
ఆ సమయంలో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు సహా ఏడుగురు ఉన్నారు. 10.40కి ఆయన్ని బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పల్స్ పడిపోయినా.. ఆయనను బతికించేందుకు 40 నిమిషాల పాటు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు పోస్టుమార్టం నిర్వహించగా, అది ఇవాళ పోలీసులకు అందుతుంది. దీంతో కోడెలది ఆత్మహత్యే.? లేక ఎలాంటి మరణమన్న విషయం రూడీ కానుంది.
టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు, అనుచరగణం సందర్శనార్థం ఆయన బౌతిక ఖాయాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు తరలించగా, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. కాగా, ఇవాళ కోడెల పార్థివదేహాన్ని ఇవాళ గుంటూరు జిల్లాలోని నరసారావు పేటకు తరలిస్తారు. సాయంత్రం నర్సారావుపేటలోని కోడెల స్వగృహానికి చేరనున్నట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more