ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను ఐసీయూలో ఉంచిన వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడిన ఆయనను వెంటిలేటర్ పై వుంచి చికిత్సను అందించారు వైద్యులు.
ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు అప్పటికే సమాచారం అందించిన వైద్యులు ఆయనను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చిరవకు వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై కొడెల శివప్రసాద్ చికిత్స పోందుతూనే తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా, ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల శివప్రసాదరావు, ఆకస్మిక మరణం ఆయన అనుయాయువులను, అనుచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురించేసింది
గత కొన్ని రోజులుగా, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పరువు తీయాలని చూస్తున్నారని కోడెల ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వైసీపీ నేతలకు విన్నతి కూడా చేశారు. ముఫ్పై ఏళ్లుకు పైగా రాజకీయాలలో వున్నానని.. ఎన్నో పదవులు అలకరించానని, అలాంటి తాను ప్రతిపక్షంలో వుంటే తనపై కక్షపూరిత రాజకీయాలు చేసి.. కేసులు బనాయించడం సముచితం కాదని కూడా కోరారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల, ఇంతటి ఘోరమైన నిర్ణయం తీసుకుని ఉంటారని ఇంటి సభ్యులు విలపిస్తూ చెప్పారు. ఆయన కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కోడెలకు చికిత్స జరుగుతుండగా, ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక కోడెల ఉరి వేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశారని తెలుసుకున్న ఆయన అభిమానులు, పలువురు తెలుగుదేశం నేతలూ, ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more