మొబైల్ వినియోగదారులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గుడ్ న్యూస్ అందించింది. మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో డిజిటల్ వ్యాలెట్ ను వినియోగించే వారికి ఊరటను కల్పించ్చింది. సర్వసాధారణంగా స్మార్ట్ పోన్లు వున్న ప్రతీ ఒక్కరు ఏదో ఒక సందర్భంలో పేటియం, ఫోన్ పే, అమజాన్ పే, గూగుల్ పే, సిట్రస్ పే, మోబీవిక్, తదితర మొబైల్ వ్యాలెట్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇన్నాళ్లు వేరు.. ఇక మీద వేరు.. అన్నట్లు భారతీయ రిజర్వుబ్యాంకు డిజిటల్ పేమెంట్స్ జరిపేవారికి తప్పకుండా కేవైసీ ద్వారా వారి పూర్తి వివరాలు పోందివుండాలని అదేశాలు జారీ చేసింది.
అంతేకాదు కేవైసీ వివరాలను తెలుపని కస్టమర్ల వాలెట్లను డీ అక్డివేట్ చేయాలని కూడా అదేశాలు జారీ చేసింది. దీంతో అనేకమంది మొబైల్ వ్యాలెట్లు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో తమకు కొంత గడువుఇస్తే కేవైసీ చేయించుకుంటామని డిజిటల్ వ్యాలెట్ దారులు కొరడంతో.. స్పందించిన రిజర్వు బ్యాంకు మొబైల్ వ్యాలెట్ దారులకు ఆరు మాసాల గడువుని పెంచింది.
కేవైసీ చేయించుకోవడానికి 2020 ఫిబ్రవరి 29వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు అందరూ మొబైల్ యూజర్లు పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే లాంటి మొబైల్ వ్యాలెట్స్ వాడుతున్నారు. వీటి ద్వారానే చాలావరకు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అనేక రకాల పేమెంట్స్ క్షణాల్లో అయిపోతున్నాయి. వీటికి కేవైసీ చేయించుకోవాలని ఆర్బీఐ చెప్పింది. దాని కోసం గతంలో ఆగస్ట్ 31 డెడ్ లైన్ పెట్టింది. ఆలోగా కేవైసీ చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి మొబైల్ వ్యాలెట్స్ పనిచేయవు అని చెప్పింది.
తాజాగా గడువు తేదీని ఆర్బీఐ పొడిగించింది. దీంతో మొబైల్ వ్యాలెట్ కంపెనీలు కూడా ఊపిరిపీల్చుకున్నాయి. తాజా ఉత్తర్వులతో ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర వ్యాలెట్స్ వాడేవారు ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్లు చేసుకోవచ్చు. అయితే కేవైసీ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని చెప్పింది. ఫిబ్రవరి 29 తర్వాత గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more