హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీకి సమీపంలో ఈ రైలు మంటలు చెలరేగాయి. మరో గంట వ్యవధిలో గమ్యానికి చేరుకొంటుండగా హర్యానా లోని ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గడ్ ప్రాంతానికి రైలు చేరుకోగానే మంటలు అంటుకున్నాయి. ముందు ప్యాంట్రీ బోగీలో మంటలు అంటుకున్నాయి. కొద్ది సమయంలోనే ఈ మంటలు ఏసీ మరియు స్లీపర్ కోచ్ లకు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసారు.
హుటాహుటిన రంగంలోకి రైలుకు అంటుకున్న మంటలను సిబ్బంది ఆర్పివేశారు. ప్రమాదాన్ని గ్రహించి మంటల్లో చిక్కుకున్న బోగీలను వేరు చేయటంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున 7 గంటల 47 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బ్రేక్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ వలన ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. వెంటనే మంటలు అంటుకున్న బోగీలను వేరు చేసి ప్రయాణికులను సిబ్బంది వేరే బోగీ లోకి తరలించారు. ప్రసుతం ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం.
రైలులోని ప్రయాణికులందరూ సురక్షితంగా వున్నారని..ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో వెళ్ళే వ్యాగన్లను కూడా అధికారులు నిలిపివేసినట్లు తెలుస్తుంది. రైలులో ఇలా మంటలు చెలరేగటానికి కల కారణాల అన్వేషణలో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో ఒక భోగీ పూర్తిగా కాలిపోయింది. రెండు బోగీలు పాక్షికంగా కాలిపోయినట్లు సమాచారం. ఎస్ 10, బీ1, ప్యాంటీ మూడు బోగీలలో మంటలు అంటుకున్నాయి. ట్రైన్ వేగంగా వెళుతూ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more