బీజేపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం శ్వాస తీసుకొనేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో కుటుంబ సభ్యులు జైట్లీని ఎయిమ్స్కు తరలించారు. గుండె సంబంధమైన విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్ బారిన పడినట్టు గతంలో ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఆయన అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్కు వచ్చి అదే చికిత్సను కొనసాగిస్తున్న జైట్లీ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎయిమ్స్ వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు.
పరామార్శించిన పరధాని మోదీ, అమిత్ షా
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, హర్షవర్దన్, రవిశంకర్ ప్రసాద్, అశ్వని చౌబే, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్ తదితరులు ఎయిమ్స్ వద్దకు వచ్చారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కేంద్ర మంత్రులంతా ఒక్కక్కరిగా చేరుకుంటుండటంతో ఎయిమ్స్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించింది. ఈ రోజు ఉదయం ఆయన ఆస్పత్రిలో చేరారని.. ఐసీయూలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని పేర్కొంది. కాసేపట్లో మరో హెల్త్ బులెటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more