dcp slaps jr doctor in vijayawada జూనియర్ డాక్డర్ పై పోలీసు జులుం.. నిలదీసిన చంద్రబాబు..

Dcp slaps jr doctor in vijayawada chandrababu blames ysrcp government

Vjayawada doctors protest , NMC bill, Vijayawada DCP , V Harshavardhan Raju, Chandrababu, Rajanna Rajyam, YSRCP Government, Andhra Pradesh

The ongoing protests against the National Medical Commission (NMC) Bill intensified in the state with a protesting medico being slapped and scores of his colleagues taken into custody by the police in Vijayawada city

జూనియర్ డాక్డర్ పై పోలీసు జులుం.. నిలదీసిన చంద్రబాబు..

Posted: 08/07/2019 05:09 PM IST
Dcp slaps jr doctor in vijayawada chandrababu blames ysrcp government

కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎంఎన్‌సీ) బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్లు ఆందోళన చేస్తున్న సంగతి విదితమే. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు.. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఓ జూనియర్ డాక్టర్‌పై డీసీపీ చేయి చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకున్న డీసీపీ హర్షవర్దన్.. చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. డాక్టర్లతో పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏంటనే జనం ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు ఆందోళన చేపట్టినా వైసీపీ ప్రభుత్వం అసహనానికి గురవుతోందని ఆయన ఆరోపించారు. ఎన్‌ఎమ్‌సీ బిల్లుపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్‌ను డీసీపీ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేనా రాజన్నరాజ్యం? అని బాబు ప్రశ్నించారు. ప్రజల గొంతునొక్కే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. పోలీసు అధికారి జూనియర్ డాక్టర్‌పై చేయి చేసుకుంటున్న వీడియోను టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.

వైద్యుల అందోళన ఎందుకనగా.?

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవినీతిలో కూరుకుపోయిందనే ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర అడుగులేస్తోంది. ఇందుకోసం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్, 1956ను రద్దు చేసి.. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు, 2019ను ఇటీవలే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారు.

నేషనల్ మెడికల్ కమిషన్‌ చట్టం అమల్లోకి వస్తే.. ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ పరీక్షలనే పీజీ కోసం ఎంట్రెన్స్ టెస్ట్‌గా ప‌రిగ‌ణించాల‌ని భావిస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారికి నేష‌న‌ల్ ఎగ్జిట్ టెస్ట్(ఎన్ఈఎక్స్‌టీ) పేరిట స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. ఎన్ఎంసీ అమల్లోకి వస్తే.. దేశ‌వ్యాప్తంగా ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష రాసేవారికి ఒకే తరహా పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఎంబీబీఎస్‌, పీజీ కాలేజీల్లో 50 శాతం సీట్ల‌పై నియంత్ర‌ణ ఉంటుంది. ఎన్ఎంసీలో 29 మంది స‌భ్యులు ఉంటారు. ఎన్ఎంసీ నియ‌మావ‌ళికి అనుగుణంగా మెడిక‌ల్ కాలేజీలు నాణ్య‌త‌ను పాటించాల్సి ఉంటుంది. ఒక‌సారి ప‌ర్మిష‌న్ పొందితే చాలు ఆ కాలేజీ మ‌ళ్లీ రెన్యూవ‌ల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vjayawada doctors protest  NMC bill  Vijayawada DCP  V Harshavardhan Raju  Chandrababu  Twitter  

Other Articles