హిందూ ఉగ్రవాదిగా అభియోగాలు ఎదుర్కోని రిమాండ్ లో వుంటూ అనారోగ్యంతో బాధపడుతున్నానని బెయిలుపై బయటకు వచ్చిన వివాదాస్పద బీజేపి నాయకురాలు.. ఏకంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై పోటీ చేసి.. మధ్యప్రధేశ్ లోని బోపాల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి గెలుపోంది పార్లమెంటులోకి అడుగుపెట్టిన ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్. అయితే అమె ఎన్నికలలో ఓటర్లను సెంటిమెంటుతో ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.
తనను జైలులో ఎలా హింసించారన్న విషయాలతో పాటు పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే అమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పెద్ద వింతేమీలేదు. ఎందుకంటే సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సార్వసాదారణమే. ఇక తాజాగా అమె మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్ లోని సెహోర్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలో వేడిరాజేస్తున్నాయి.
మరుగుదొడ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేయడానికి తను ఎంపీగా ఎన్నిక కాలేదంటూ అమె చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి చేపడుతున్న స్వచ్చా అభియాన్ కార్యక్రమానికి తూట్లు పోడిచేలా వున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు ఏం చేస్తానని చెప్పి ఎంపీని అయ్యానో వాటన్నింటినీ చేసేందుకు కట్టుబడి ఉన్నానని, నిజాయతీగా చేస్తానని వ్యాఖ్యానించారు. దీంతో సాథ్వి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
#WATCH BJP MP from Bhopal, Pragya Thakur in Sehore: Hum naali saaf karwane ke liye nahi bane hain. Hum aapka shauchalaya saaf karne ke liye bilkul nahi banaye gaye hain. Hum jis kaam ke liye banaye gaye hain, vo kaam hum imaandaari se karenge. #MadhyaPradesh pic.twitter.com/VT4pcGKkYx
— ANI (@ANI) July 21, 2019
(And get your daily news straight to your inbox)
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more
May 19 | వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని స్థానిక కోర్టు ఈ కేసును విచారించకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం... Read more
May 19 | నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రతీరోజు నదుల్లోనే స్నానం చేస్తుంటారు. నదీ సాన్నాలు ఆచరించడం వారి జీవన విధానంలో భాగమైపోతుంది. క్రమంగా అడవులు తగ్గడం, వర్షాలు కురవకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రవహించాల్సిన నదులు కూడా నానిటికీ... Read more