తెలంగాణవాసులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు ఏప్రిల్ 28, 29 తేదీలు అత్యంత వేడిమితో కూడుకున్న రోజులని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. యావత్ తెలంగాణ మిప్పులు కోలిమిలా కుతకుత ఉడుకుతోంది. ఇక ఏప్రిల్ లోని ఈ రెండు రోజులు మరింతగా ఎండలు మండుతాయని, దీనికి తోడు వడగాల్పులు కూడా వీచే అవకాశముందని పేర్కోన్నారు.
తెలంగాణలోని కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలకు చేరుకోవడంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోరట్పల్లి, మంచిప్పలలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోర్తాడ్లో 45.3 డిగ్రీలు, లక్ష్మాపూర్, ఆదిలాబాద్ జిల్లా బేల, జైనథ్లో 45.4 డిగ్రీలు, నిజామాబాద్లో 44.7 డిగ్రీలు, రామగుండంలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్లో 43.8 డిగ్రీలు, హైదరాబాద్లో 41.2 డిగ్రీలు నమోదైంది.
నిజానికి వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం.. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైతే వడగాలులు వీస్తున్నట్టే లెక్క. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప ఎండలో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీనికి తోడు ఎండలో బయలకు వెళ్లే వారు నీరు అధికంగా తీసుకోవాలని వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తులు కూడా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more