జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును ఎంతగా కోరుకుంటున్నారో చూసిన తరువాత.. అందుకు కారణమైన జనసేన పార్టీ అధినేత ముఖ్యమంత్రి అవుతారని అమె ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో జనసేన-బీఎస్పీ-వామపక్షాల కూటమి తప్పక అధికారంలోకి వస్తుందని అమె అశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడలోని సింగ్ నగర్లో ‘బహుజన జనసేన యుద్ధ భేరి’ పేరిట నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో అమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి పవన్ కల్యాణ్ అన్ని విధాలా అర్హుడని అన్నారు. అధికారంలోకి వచ్చే తమ కూటమి ప్రభుత్వం గతంలో ఏపీని ఏలిన రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా.. ఉత్తర్ ప్రదేశ్ లోని బీఎస్పీ పాలన సాగించిన విధానాలనే కొనసాగిస్తూ పాలన సాగుతుందని అమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమిని గెలుస్తుందన్న నమ్మకం తనకుందన్న అమె అరుపులు, ఈలలు, కేకలతో అది సాధ్యం కాదని, ఎన్నికలకు తక్కువ సమయమే వున్నందున్న కార్యకర్తలు తమ శక్తిమేర ప్రచారం చేసి కూటమిని విజయం దిశగా నడిపించాలని కోరారు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడొద్దని, కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని మాయావతి కోరారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సరైన న్యాయం జరగలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more