ప్రముఖ హిందీ బుల్లి తెర నటికి చేధు అనుభవం ఎదురైంది. ఆమె అదృష్టం బాగుండబట్టి కానీ.. లేకపోతే అమె చేసిన పనికి ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయుండేవి. ఇంతకీ ఈ నటి చేసిందేంటో తెలుసా.. తప్పతాగి.. తాగిన మత్తులో కారును నడుపుతూ రోడ్డుపైకి రావడం. రోడ్డుపై తమదారిన వెళ్తున్న వారి వాహనాలను ఢీకొనడం.. ఇంకా మాట్లాడితే.. తమకు జరిగిన నష్టానికి పరిహారమెంతో చెప్పాలని.. తిరగబడ్డ స్థానికులను, నష్టపోయిన భాధితులను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.
అంతటితో అగకుండా తానెవరో తెలుసా.. తనకెవరు తెలుసో తెలుసా అంటూ ఫోన్ తీసుకుని సిఫార్సుల కోసం తన ప్రయత్నాలను చేయడం.. చదువుతుంటేనే వార్నీ వాహనాలను ఢీకొట్టింది కాక.. మళ్లీ జబర్థస్తీ కూడా చేస్తుంటి చెప్మా అనిపిస్తుంది కదూ. టీవీ సీరియల్స్ లో పెద్ద ఉత్తమురాళ్ల మాదిరిగా మహిళల మనసు దోచుకున్న బామల బయటి బాగోతం ఇంతేగా అంటారా.? అంతేగా ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా టీవీ సీరియల్స్ హవా నడుస్తోంది మరి.
ఇంతకీ హిందీ సీరియల్స్ చూసే ప్రతి ఒక్కరికీ సుపరిచితురాలు రూహీ శైలేష్ కుమార్ సింగ్. చీర కడితే సంప్రదాయానికే వన్నె తెచ్చేలా నటించే ఈ నటి తప్ప తాగుతుంది. తన షూటింగ్ అయిన తర్వాత పబ్స్ లో మిత్రులతో కలసి ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో అమె ఎంత తాగుతుందో కూడా తెలియదంటే నమ్మశక్యం కాదులేండి. ఇదే ఇప్పుడు కొంప ముంచింది. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న తరువాత.. అర్థరాత్రి వరకు గంతులు వేసిన అమ్మడు.. ఆ తర్వాత తీరిగ్గా కారు తీసింది. తాగిన మైకంలో సొంతంగానే డ్రైవింగ్ చేసింది. ఇంకేముందీ.. స్పీడ్ తెలియలేదు.
అంతే.. కారుతో బీభత్సం సృష్టించింది. శాంటాక్రాజ్ దగ్గర నాలుగు కార్లు, మూడు బైక్లను తన కారుతో ఢీకొట్టింది. ఆ వాహనాలు బాగా డ్యామేజ్ అయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. రూహీ శైలేష్ కుమార్ సింగ్ తాగిన మత్తుల్లో వాహనాలను ఢీకొట్టటమే కాకుండా.. ప్రశ్నించిన స్థానికులపై వాగ్వాదానికి దిగింది. నేను ఎవరో తెలుసా.. నాకు ఎవరు తెలుసో తెలుసా అంటూ గొప్పలకు పోయింది ఈ నటి. టీవీ నటి ఓవరాక్షన్ చేస్తున్నప్పుడు కొందరు వీడియో తీసి పోలీసులకు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో వాహనాలు మాత్రమే దెబ్బతిన్నాయి. ఎవరూ గాయపడలేదు. అదే విధంగా టీవీ నటి సింగ్ కారు కూడా దెబ్బతిన్నది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
ఇదిలావుండగా, ఈ ఘటనకు పాల్పడింది ప్రముఖ టీవీ నటి రుహీ శైలేష్ కుమార్ సింగ్ కాగా, విమర్శలు మాత్రం నటి రూహీ సింగ్ వైవు వెళ్లున్నాయి. అందుకు కారణం మీడియానే. మీడియా రూహీ శైలేష్ కుమార్ సింగ్ కు బదులు రూహీ సింగ్.. అనుకుని అమె ఫోటోలను ప్రచురించడంతో అమెపై విమర్శలు వెల్లివిరిసాయి. దీంతో ఆమె తానేం తప్పు చేయకపోయినా.. ఇలా విమర్శలపాలు కావడంతో ఎక్కడ తేడా వచ్చింది చెప్మా అని చూస్తే.. మీడియాలో రూహీ శైలేష్ కుమార్ సింగ్ పేరున కథనాన్ని ప్రచురించినా.. ఫోటో మాత్రం రూహీ సింగ్ ది ప్రచురించడంతో అమె విమర్శలపాలైంది. దీంతో అమె మీడియాపై కస్సుబస్సు మంటోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more