జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతీ రైతుకు నెలకు రూ. 5 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కొత్త యువ రైతులను తయారు చేయాలనే బలమైన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. భూములిచ్చి లక్షమంది యువ రైతులను తయారు చేస్తానని హామీ ఇచ్చారు. తన లాగా పదో తరగతి చదివితే చాలన్నారు. యాక్టర్ కంటే ముందు తాను రైతునన్నారు. లాండ్ ఆండ్ ఆర్డర్ కోసం 25 వేల పోలీసు పోస్టులను భర్తీ చేస్తానని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో తనను టార్గెట్ చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ను అంతే ధీటుగా ఎదుర్కోంటూ కౌంటర్ ఇస్తున్నాడు పవన్. చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... జగన్పై మరోసారి విమర్శలు గుప్పించారు. శాసనసభకు వెళ్లని ప్రతిపక్ష నేత మనకు అవసరమా అని ప్రశ్నించారు. టీడీపీకి వైసీపీ నేతలంటే భయం అని వ్యాఖ్యానించిన పవన్... వైసీపీని ఎదుర్కోవాలంటే జనసేనే కరెక్ట్ అని కామెంట్ చేశారు. ఏ పార్టీలో అయిన పెట్టుకోవాలనుకుంటే బహిరంగంగానే ఆ పని చేస్తానన్న జనసేనాని... జగన్ తరహాలో దొడ్డిదారిన మోదీ కాళ్లు పట్టుకోనని ఎద్దేవా చేశారు.
అడ్డగోలుగా లక్షల కోట్లు దోచుకుంటున్న నేతలు ఇవాళ తామే నిజయితీకి కేరాఫ్ అడ్రస్ గా ఉదహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఎవడబ్బ సొమ్మని కోటాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు పెన్షన్ వస్తుందని...అందరికీ అన్నం పెట్టే రైతుకు పెన్షన్ రాదని వాపోయారు. ఆడ పిల్లలకు ఎల్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.10లక్షల బీమా పథకాన్ని వర్తింప చేస్తానని చెప్పారు.
రాష్ట్రంలో ఆదాయంతో నిమిత్తం లేకుండా వైట్ కార్డు, పింక్ కార్డుతో నిమిత్తం లేకుండా, డబ్చు ఉన్నా లేకున్నా ప్రతి కుటుంబానికి ఉచితంగా పది గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయిస్తానని తెలిపారు. తక్కువ మంది కుటుంబ సభ్యులుంటే ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడిస్తున్న రేషన్ బియ్యం తినడానికి పనికి రావని అందుకనే తమ పార్టీ అధికారంలోకి వస్తే.. పేదలకు బియ్యం బుదలుగా నగదును అందిస్తామని హామీ ఇచ్చారు. తాను ఒక మాట ఇస్తే.. అదే మీద నిలబడుతానని స్పష్టం చేశారు.
సైకిల్ పాతబడిపోయిందన్న పవన్... కేసీఆర్ ఎప్పుడో సైకిల్ చైన్ తెంపారని కామెంట్ చేశారు. టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఏపీలో రాజకీయాలు కేవలం రెండు కుటుంబాలు మాత్రమే చేయాలా అని ప్రశ్నించారు. తాము సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నామని.. వైసీపీ లాగా బీజేపీతో చీకటి ఒప్పందాలను చేసుకోలేదని.. ప్రత్యేకహోదాను కల్పించని పార్టీని భుజాల మీదికి ఎక్కించుకోలేదన్నారు. తాము సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more