పబ్జీ గేమ్.. పిల్లలను, యువతను తనవైపుకు ఆకర్షిస్తున్న గేమ్ ఇది. ఈ గేమ్ పై ఇప్పటికే పలు భారతీయ పట్టణాలు, నగరాల్లో పోలీసులు నిషేధం విధించారు. ఇకపై ఎవరైనా పబ్జీ గేమ్ అడినట్లు కనిపిస్తే వారిపై పిర్యాదు చేస్తే వారికి శిక్ష కూడా విధించేలా చట్టాలను తీసుకువచ్చారు పోలీసు అధికారులు. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా ఇలాంటి మార్పులు రావడం లేదు.
గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా పేకాట క్లబులు కనిపించడం లేదు. పేకాల వల్ల ఇల్లు గుల్ల చేసుకునే వారు కానీ, ప్రాణాలు తీసుకుని వారు కానీ కనిపించడం లేదు. అయితే పెద్దవారి విషయంలోనే నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం ఎంతో ఉజ్వల భవిష్యత్తు వున్న బాలబాలికలు, యువత విషయంలో మాత్రం జాప్యం చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ కోట్ సహా గిర్, సోమనాథ్, భవ్ నగర్ తో పాటుగా పలు నగరాల్లో నిషేధం వున్న పబ్జీపై తెలంగాణలో కూడా విధించవచ్చుకదా.. అన్న అభ్యర్థనలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ గేమ్కు బానిసలవ్వద్దని అటు వైద్యులు, ఇటు నిపుణులు చెబుతున్నా యువత, బాలబాలీకలు పెడచెవిన పెడుతున్నారు. ఈ గేమ్ మత్తులో చిక్కుకుని అనేక మంది యువత తమ చదువులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నా.. ప్రభుత్వం ఈ పబ్జీ గే్మ్ పై చర్యలు చేపట్టకపోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పబ్జీ గేమ్ విషయంలో ఉపేక్షించడం సరికాదని వెంటనే నిషేధం విధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫలితంగా పబ్జీ మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇదే గేమ్కు బానిసలా మారిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జరిగింది.
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మల్లాపూర్ కు చెందిన శేషత్వం వెంకటనారాయణ- శారద దంపతుల చిన్న కుమారుడు సాయిచరణ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతడు కొన్ని రోజులుగా పబ్జీ గేమ్ కు అలవాటు పడి చదువును నిర్ణక్ష్యం చేస్తున్నాడు. గమనించిన తల్లిదండ్రలు అతడిని మందలించారు. అయినా, అతడు వారి మాటను వినలేదు. దీంతో గేమ్ ఆడవద్దంటూ గట్టిగా చెప్పారు.
దీంతో మనస్థాపానికి గురైన సాయిచరణ్.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. కొడుకు గదిలో ఏం చేస్తున్నాడోనన్న అనుమానంతో వచ్చి చూసే సరికి సాయిచరణ్ ఫ్యాన్ కు వెలాడుతూ కనిపించాడు. పక్కింటి వారి సాయంతో తలుపులు పగలకొట్టి అతడిని బయటికి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే సాయిచరణ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more