సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం మండలాల ప్రజలు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ సమీపంలోని అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)లో చిరుత పులి సంచారం చేస్తుందన్న వార్తలు వీరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఇక్రీశాట్ లోని ఫీల్డ్ సిబ్బంది కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే వీరు పనులు నిర్వహించే ప్రదేశాలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక్రీశాట్ అధికారులు.
అయితే ఎంత భద్రత వున్నా ఫీల్డ్ లో పనులకు వెళ్లేందుకు మాత్రం అధికమంది సిబ్బంది జంకుతున్నారు. దీంతో ఇక్రిశాట్ లో పరిశోధనలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్రిశాట్లో వారం రోజులుగా చిరుత తిరుగుతున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆదివారం సాయంత్రం 6.44 గంటల సమయంలో ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో ఇది రికార్డు కూడా అయింది. అప్పటినుంచి క్షేత్ర స్థాయి పరిశోధనలు నిలిపివేశారు. ఇక్రిశాట్లో సుమారు 40 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిశోధనలు చేస్తున్నారు. చిరుత సంచారంతో ప్రస్తుతం వారందరూ ల్యాబ్లకే పరిమితమవుతున్నారు.
సోమవారం రాత్రి సమయంలో చిరుత ఓ ముళ్లపందిని తిన్న ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాని అడుగుజాడలను పర్యవేక్షించేందుకు 11 మంది సిబ్బందిని నియమించారు. దాని కదలికలను నిత్యం పర్యవేక్షించేందుకు 13 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. చిరుత సోమవారం రాత్రి సమయంలో అధికారులు ఏర్పాటు చేసిన ఓ బోను వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయినట్టు కెమెరాల్లో కనిపించింది. బోను లోపలికి రావడానికి చిన్న మేకను ఎరగా వేశారు. రెండు బోనుల్లో రెండు మేకలు అది స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు.
గతంలోనూ ముచ్చెమటలు పట్టించిన చిరుత..
ఇక్రిశాట్ లో చిరుత చోరబడటం.. ఇదే తొలిసారి కాదు. 2014లో కూడా చిరుత సంచరించి సిబ్బందిని, సమీప గ్రామస్థులను భయానికి గురిచేసింది. అప్పుడు కూడా అటవీశాఖ అధికారులు సుమారు నాలుగు రోజుల శ్రమించారు. అయితే అధికారుల ప్రయత్నాలకు చెక్ పెట్టిన చిరుత.. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు. కాలక్రమేనా అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు. కనీసం ఇక్రిశాట్ యాజమాన్యం కానీ, అటవీశాఖ అధికారులు కానీ చిరుత ఎటువెళ్లిందన్న దానిపై అధ్యయనం చేయలేదు. ఫలితంగా మళ్లీ ఐదేళ్ల తరువాత చిరుత జాడ పునరావృతం అయ్యింది. మరి ఈ సారైనా అధికారులు దీనిని పట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more