తెలుగు రాష్ట్రాలు అప్పుడే సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. పండగ కోసం ప్రజలంతా పట్నం నుంచి పల్లెలకు తరలివెళ్తున్నారు. కొందరు రైళ్లలో, మరికొందరు బస్సుల్లో, ఇంకొందరు సొంత వాహనాల్లో.. ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. ప్రధానంగా, హైవేల మీద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సిటీనుంచి తరలివస్తున్న వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది.
పండగ కోసం ఊరికెళ్తున్న జనాలకు.. నరకం కనిపిస్తోంది. దీంతో, పండగ వేళ సొంతూరు ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీనికితోడు టోల్ ట్యాక్స్ పేరిట జేబులకు భారీగా చిల్లుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్ట్యాక్స్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈనెల 12, 13, 16 తేదీల్లో ట్యాక్స్ వసూలును నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది.
దీంతో సొంతూరు వెళ్తున్న ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. దీని వల్ల ప్రధాన రహదారులపై టోల్ట్యాక్స్ పేరిట జేబులకు చిల్లులు పడడం తగ్గడంతో పాటు, ట్రాఫిక్ జామ్లకు కూడా ఆస్కారం ఉండదు. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే ప్రధాన రహదారులన్నింటిపైనా.. భారీగా టోల్ ప్లాజాలు ఉన్నాయి. దీంతో భారీగా ట్యాక్సులు చెల్లించాల్సి వచ్చేది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం ప్రయాణికులకు భారీగా ఊరట కలిగించిందనే చెప్పాలి. అయితే, ఏపీ ప్రభుత్వం నిర్ణయం స్టేట్ హైవేస్ మాత్రమే వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ ఉన్న స్టేట్ హైవేస్కు మాత్రమే ఇది వర్తిస్తుందంటున్నారు. మిగితా జాతీయ రహదారులపై టోల్ ప్లాజా వసూళ్లు కొనసాగుతున్నాయి. నేషనల్ హైవేస్ నుంచి సమాచారం వస్తే తప్ప.. ఆపేది లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more