ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానంటూ వెంట పడి వేధిస్తూ.. శారీరిక సంబంధం కోసం వత్తిడి చేస్తున్న యువకుడికి గుణపాఠం చెప్పే క్రమంలో కటకటాలపాలైన వివాహిత ఉదంతం ముంబయి నగరంలో సంచలనం రేపింది. ముంబయి నగరంలోని డోంబివలికి చెందిన 47 ఏళ్ల వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. గృహరుణాలు ఇప్పించే ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న తుషార్ పుజారే (27) అనే యువకుడు అమె పొరిగింట్లోనే నివాసం వుంటున్నాడు.
గత కొంతకాలంగా వివాహితను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి తన కోరిక తీర్చమంటూ వేధిస్తున్నాడు తుషార్. తాను వివాహితనని, తనకు భర్తతోపాటు ఇద్దరు పిల్లలున్నారని చెప్పి వివాహిత యువకుడి ప్రేమను తిరస్కరించింది. అయినా మాట వినని తుషార్ పుజారే వివాహిత భర్తను కలిసి తాను అతని భార్యను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడు. దీంతో వివాహితపై ఆమె భర్తకు అనుమానం ఏర్పడి, కుటుంబకలహాలు రేగాయి.
దీంతో ఆగ్రహం చెందిన వివాహిత కీచకుడైన తుషార్ పుజారేకు గుణపాఠం చెప్పాలని తనకు తెలిసిన ఇద్దరు యువకులతో కలిసి ఓ పథకం వేసింది. తేజాస్ మహాత్రే(22), ప్రవీణ్ కెనియా (25) లతో కలిసి వివాహిత రాత్రి 9 గంటలకు తమకు ఇంటి రుణం కావాలని చెప్పి తుషార్ ను రప్పించి వారితో కలిసి కొట్టింది. అనంతరం పదునైన కత్తి తీసుకొని తుషార్ పురుషాంగాన్ని కోసింది. అనంతరం ప్రాణాపాయస్థితిలో ఉన్న తుషార్ ను యువకులతో కలిసి వివాహిత ఆసుపత్రిలో చేర్చింది.
అస్పత్రిలో వైద్యుల ఎదుట అమె తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. అయితే తాను ఒక్కదాన్నే ఈ నేరానికి పాల్పడ్డానని చెప్పినా.. నమ్మని పోలీసులు తమదైన శైలిలో విచారించిన తరువాత అమె ఇద్దరు నిందితుల పేర్లను బయటపెట్టింది. ప్రస్తుతం తుషార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు తుషార్ పురుషాంగంతోపాటు కత్తిని స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితురాలైన వివాహితతోపాటు తేజాస్ మహాత్రే(22), ప్రవీణ్ కెనియా (25) లను అదుపులోకి తీసుకున్నారు. ముంబయి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more