తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. తొలుత రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సభ నేపథ్యంలో కొండగల్ బంద్ కు కాంగ్రెస్ ప్రకటించిందని, ఇందుకు సంబంధించిన వీడియోలు, పేపర్ కట్టింగ్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని, వారి అదేశాల మేరకు ఆయనపై చర్యలు తీసుకన్నామని పోలీసుల చర్యలను సమర్థించుకున్న ఈసీ అధికారులు.. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సీరియస్ కావడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
వికారాబాద్ జిల్లా ఎస్పీ టి.అన్నపూర్ణపై ఎన్నికల సంఘం అధికారులు బదిలీ వేటు వేశారు. వికారాబాద్ జిల్లాకు అన్నపూర్ణ స్థానంలో 2005 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అవినాశ్ మొహంతిని ఎస్పీగా నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కమిషన్ తెలిపింది. అన్నపూర్ణను పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేయాలని కూడా అదేశించిన ఎన్నికల సంఘం.. అమెకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధులకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించరాని కూడా ఆదేశించింది.
ఇవాళ మధ్యహ్నం రెండు గంటలల్లోగా అవినాశ్ మహంతిని బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం జారీచేసిన అదేశాలలో పేర్కోంది. కాగా, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో వున్న నేపథ్యంలో ఆయనకు పోలీసు అధికారులు సమాచారం అందించనున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా వున్న రేవంత్ రెడ్డి కొడంగల్ లోని నివాసంలోకి వెళ్లిన పోలీసులు ఆయన గేటు తాళాలను బద్దలుగొట్టి మరీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు హైకోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ నివేదిక తనకు అందజేయాలని అదేశించిన హైకోర్టు.. ఇవాళ కూడా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి రేవంత్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఎన్నికల విధుల్లో డీజీపీ బిజీగా ఉన్నారని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే రేవంత్ ను అరెస్ట్ చేశామని చెప్పారు.
దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించింది. డీజీపీ కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని, అరెస్ట్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తాము కూడా కేసుల విచారణలో బిజీగా ఉన్నామని... కోర్టుకు రావడానికి డీజీపీ ఒక్క గంట సమయాన్ని కేటాయించలేరా? అని కోర్టు ప్రశ్నించింది. డీజీపీ కోర్టుకు వచ్చి నేరుగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ మధ్యాహ్నం 2.30 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more