రాజకీయ పార్టీలో తమ లబ్ది కోసం ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యంతో ప్రజలు సోమరులుగా మారారని అభిప్రాయపడింది. ఉచిత బియ్యం పథకం మంచిదే అయినా దానిని కేవలం నిరుపేదలకు మాత్రమే అందించాలని కోరింది. అలా కాకుండ ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలకు వీటిని ఉచితంగా అందిస్తుండటంతో ప్రజలు సోమరులయ్యారని పేర్కోంది. ఉచిత పథకాలు పేదలకు, లేక అభాగ్యులకు మాత్రమే అందించాలని తెలిపింది.
ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించటంలో భాగంగా ప్రభుత్వం ఉచిత బియ్యం పంఫిణీ పథకాన్ని అన్నివర్గాల వారికి అందిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలను నిష్ప్రయోజకులుగా మారుస్తుందని అన్నారు. ఇకపై ఈ పథకాలను పేదలకు మాత్రమే వర్తింపజేయాలని అదేశించింది. ఇకపై బియ్యం, ఇతర సరకులు ఉచితంగా కేవలం పేదలు, బడుగులు, అభాగ్యులకు మాత్రమే అందించాలని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వం ప్రతిదీ ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నారని కోర్టు తెలిపింది. దీని ఫలితంగా ప్రజలు సోమరులు అవుతున్నారని పేర్కొంది.
2017-18 వ సంవత్సరంలో రూ.2,110 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉచిత బియ్యం కోసం ఖర్చు చేసిందని కోర్టు తెలిపింది. నిరుపేదలకు మాత్రమే మాత్రమే ఉచిత బియ్యం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జస్టిస్ ఎన్.కిరుబకరన్ ,అబ్దుల్ ఖ్వాదీస్ తో కూడిన బెంచ్ అడ్వకేట్ జనరల్ కు సూచించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైన బీపీఎల్ సర్వే చేయించిందా అని ప్రశ్నించింది. గత పదేళ్ల వార్షిక రిపోర్టులను నవంబర్ 30 జరిగే తీర్పు నాటికి అందించాలని సివిల్ సప్లై కార్పోరేషన్ ను కోర్టు ఆదేశించింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more