ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తో తాను మాట్లాడినట్టు ప్రచారంలో ఉన్న అడియో టేపుల్లో వున్న గొంతు తనది కాదని నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ టేపులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఓటమిని జీర్ణంచుకోలేక టీఆర్ఎస్ అడిస్తున్న నాటకాలలో ఇది ఓ నాటకమని ఆయన చెప్పుకోచ్చారు. ఆ టేపులు టీఆర్ఎస్ సృష్టించినవి కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా కానీ, తన వాయిస్ కానీ ఇందులో లేదనే విషయం స్పష్టమైందని వివరించారు. తాను మాట్లాడినట్టు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కూడా సిద్దమని సవాల్ విసిరారు.
సరైన ఆధారాలు లేకుండా తనపై అరోపణలు చేయడం సముచితం కాదని అన్నారు. అసలు అసదుద్దీన్ ఓవైసీని తాను ఎప్పుడు కలవలేదని చెప్పుకోచ్చిన ఆయన ఎప్పుడో పదేళ్ల క్రితం ఆయనను చూశానని చెప్పారు. అలాంటి వ్యక్తిని తాను ఫోన్ లో మాట్లాడి డీల్ కుదుర్చుకున్నానంటే ఎవరైనా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఈ వివాదాన్ని సృష్టిస్తున్నాయని.. అందులో తనను ఇరికించాలని చూస్తున్నాయని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తన గెలుపును అడ్డుకునేందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఒక పార్టీ అధ్యక్షుడు కేవలం రూ. 25 తీసుకుని తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మైనార్టీ ఓట్లు అడిగే దమ్ములేకే ఓవైసీని తెచ్చారని విమర్శించారు. ఓవైసీ దగ్గర ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిర్మల్ లో తమ పార్టీ తరపున అభ్యర్థిని కూడా నిలబెట్టని ఎంఐఎం పార్టీ.. గత ఎన్నికలకు ముందు ఇక్కడి వచ్చిన బీఎస్పీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరిన అసద్.. ఈ సారి ఇక్కడకు వచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారని మహేశ్వర్ రెడ్డి పేర్కోన్నారు.
నిన్న తన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ సహా మహాకూటమి మద్దతు పలుకుతూ సుమారు 60 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలిరాగా, వారందరితో కలసి ర్యాలీగా వెళ్లిన తాను తన నామినేషన్ ను దాఖలు చేశానని చెప్పారు. ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడం ఇదే తొలిసారని పేర్కోన్నారు. అదే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు తరలివస్తే కనీసం 3 నుంచి నాలుగు వందల మంది కూడా హాజరుకాలేదని.. దీంతో తనను ఢీకొనే ధైర్యం లేక అసద్ చౌకబారు అరోపణలు చేశారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more