భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, ఉక్కుమనిషిగా ఖ్యాతిగడించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మహా విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆవిష్కరించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారకార్థం ఆయన 143 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ప్రధాని ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ కు ప్రధాని ఘన నివాళులు అర్పించారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో సాధు బెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అవిష్కరణతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని కూడా గుర్తింపును పోందింది. దీంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టనుంది. ఈ విగ్రహ నిర్మాణంతో గుజరాత్ లోని సర్థార్ సరోవర్ డ్యామ్ తో పాటు నర్మదా జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దనున్నారు. 2013 అక్టోబర్ 31 గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మోదీ ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
దాదాపు 182 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా రికార్డు సొంతం చేసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఇది రెట్టింపు ఎత్తులో ఉంటుంది. సర్థార్ సరోవర్ డ్యామ్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడంలో భాగంగా 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సరోవర్ డ్యామ్ తో పాటు చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.
దాదాపు 30 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 37 మంది పటేల్ కుటుంబీకులు పాల్గొన్నారు. పటేల్ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు ఆందోళన చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more