సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన తెలుగుతేజం, ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు నిన్న అర్థరాత్రి రెండు గంటల సమయంలోనే తన బాధ్యతలను స్వీకరించారు. ఇలా బాధ్యతలను స్వీకరించిన ఆయన వెనువెంటనే తమ స్వయం ప్రతిపత్తి సంస్థలో అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్న సీనియర్ అధికారులకు జలక్ ఇచ్చారు. అంతేకాదు.. సదరు అధికారుల కింద పనిచేసిన దిగువశ్రేణి అధికారులకు కూడా నాగేశ్వరరావు తన మార్కును చూపిస్తున్నారు.
స్వయం ప్రతిపత్తి సంస్థగా వున్న సీబిఐ ప్రతిష్టను మసకబారేట్లు చేసి.. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న తరుణంలో బాధ్యతలను చేపట్టినా నాగేశ్వార రావు రాకేశ్ అస్థానా, అలోక్ వర్మకు చెందిన బృందం సభ్యులను వివిధ ప్రాంతాలకు బదిలీతో చెక్ పెట్టారు. వీరి కింద మొత్తం 13 మంది కీలక అధికారులను బాధ్యతలను నిర్వహించగా వారందరినీ నాగేశ్వర రావు ట్రాన్స్ఫర్ చేశారు. సీబీఐలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో సంస్థ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు ఆయన ఈ చర్యలు తీసుకున్నారని వార్తలు వినబడుతున్నాయి.
సీబీఐ డైరెక్టర్గా ఉన్న అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా సెలవులో వెళ్లాల్సిందిగా డీవోపీటీ కోరిన విషయం తెలిసిందే. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న మన్నెం నాగేశ్వరరావును సీబీఐ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 2 గంటలకే సీబీఐ డైరెక్టర్గా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించి, విధులకు హాజరయ్యారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
10,11 అంతస్థుల్లోని అలోక్ వర్మ, రాకేష్ అస్థానా గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని, ఆ తరువాత రెండు గదులను సీజ్ చేశారు. ఈ క్రమంలో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశాలకు పారిపోయిన అర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు సహకరించిన కొందరు అధికారులను వివరాలతో పాటు పక్కా అధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి. మాల్యా పలాయనానికి ఒక్క రోజు ముందు ఆయనపై ఉన్న లుకౌట్ నోటీస్ ను డీగ్రేడ్ చేస్తూ సీబీఐ వెలువరించిన ఉత్తర్వుల కాపీని ఆయన స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
మాల్యా పారిపోవడానికి నిర్ణయించుకున్న తరువాత తన పరపతితో లుకౌట్ నోటీసుల తొలగింపునకు ప్రయత్నించగా, అందుకు సహకరించిన కొందరు సీబీఐ అధికారులపై ఆస్థానా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఆస్థానా చేసిన విచారణలో వెల్లడైన నిజాలకు సంబంధించిన కీలక పత్రాలు కూడా ఈ తనిఖీల్లో నాగేశ్వరరావు కంట బడినట్టు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించడంపై అలోక్వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను సెలవుపై పంపించడాన్ని ఆక్షేపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. శుక్రవారం పిటిషన్పై విచారణ జరుగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more