హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం ఇటు భారత్ లో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. గత పక్షం రోజులుగా తాము ఎదుర్కోన్న వేధింపులను వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళామణులు వెల్లడించారు. నానా పటేకర్ పై తనుశ్రీదత్త చేసిన అరోపణల నుంచి ప్రారంభమైన ఈ వేధింపులు అలోక్ నాథ్, గేయ రచయిత వైరముత్తు, నవలా రచయిత చేతన్ భగత్, టాటా మోటార్స్ ఉన్నతాధికారి సురేశ్ రంగరాజన్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ఇలా చాలామందినే చుట్టేశాయి.
ఇక తాజాగా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనమిది మంది మహిళలు బయటికి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకునపడింది. దీంతో దిట్టుబాటు చర్యలకు పూనుకుంటున్న కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఎట్టకేలకు కదిలింది. మహిళా బాధితుల నుంచి అరోపణలు ఎదుర్కెంటున్న పలువురు ప్రముఖలను విచారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.
ఈ కమిటీలో నలుగురు విశ్రాంత న్యాయమూర్తులతో పాటు న్యాయకోవిదులు కూడా వుంటారని అమె తెలిపారు. వీరు మీటూ పిర్యాదులపై విచారణ నిర్వహించే ఏర్ాపటును చేస్తామని అమె తెలిపారు. లైంగిక వేధింపుల అరోపణలు చేస్తున్న మహిళలందరి పట్ల తనకు నమ్మకముందని అన్నారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఉన్న బాధ, గాయాలను తాను నమ్ముతున్నానని తెలిపారు. మహిళలు తమపై జరిగిన అకృత్యాలను ధైర్యంగా బయటపెట్టడం సంతోషంగా ఉందని మేనకా గాంధీ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more