తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు భారీ షాక్ ఇస్తూ.. ఆ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే అలా చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే అమె మళ్లీ యూటార్న్ తీసుకున్నారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని గత రెండు పర్యాయాలుగా ప్రయత్నాలు చేసి విఫలమైన ఆమె.. బీజేపిలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తన ఆశ నెరవేరదని బీజేపి తీర్థం పుచ్చుకుని ఏకంగా జాతీయ నేత మురళీధర్ రావు, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో కాషాయ కండువాను కప్పుకున్న విషయం తెలిసిందే. అమె చేరిక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. దామోదర రాజనర్సింహకు.. పద్మినీ రెడ్డికి మధ్య ఎలాంటి విభేధాలు కూడా లేవని సమాచారం. అలాంటప్పుడు అమె భర్త పార్టీని కాదని బీజేపిలోకి ఎందుకు చేరారన్న విషయమై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ తరుణంలో అమె బీజేపిలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ అమె తిరిగి మాతృసంస్థకు చేరుకున్నారు. గంటల వ్యవధిలోనే పద్మినీ రెడ్డి తన మనసు మార్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పాలపై వున్న నమ్మకంతోనే తాను బీజేపిలో చేరానని చెప్పిన అమె.. కొన్ని గంటల్లోనే తిరిగి సోంతపార్టీకి రావడంతో మోడీ పాలనపై నమ్మకం అప్పుడే సడలిపోయిందా.? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ ఆమె సంచలన ప్రకటన చేశారు. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయనకు రాజకీయంగా సంపూర్ణంగా సహకరించేందుకు కూడా తాను సిద్దమని అమె చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకున్నానని, అందుకే, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఇంత ప్రతిస్పందన ఉంటుందని తాను ఊహించలేదని, బీజేపీలోకి వెళ్లడం అనుకోకుండా జరిగిన సంఘటనని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more