టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదాయపన్నును ఎగవేశారన్న అభియోగాలపై ఆయన నివాసం సహా కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. అటు ఖమ్మం జిల్లాలోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు ఇటు హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోగల నివాసం, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులను కొనసాగుతున్నారు అధికారులు.
శ్రీనివాసరెడ్డికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ, దానికి సంబంధించిన ప్రాజెక్టులపై అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు జరుగుతుండటంతో.. ప్రస్తుతం ఎంపీ ఇంట్లోకి వెళ్లడానికి ఎవరిని అనుమతించడం లేదు. ఈ ఉదయం 9గంటలకు మొదలైన సోదాలు మధ్యాహ్నాం వరకు కొనసాగుతూనే ఉన్నాయి.కాగా, గత ఎన్నికల్లో వైసీపీ టికెట్పై ఎంపీగా గెలిచిన పొంగులేటి.. ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఆయన కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో ఆయన ఇంట్లో ఐటీ దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు కేంద్రంలోని ప్రభుత్వంతో చట్టాపట్టాలేసుకుని తిరిగుతున్న రాష్ట్ ప్రభుత్వంలోని అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడి నివాసంతో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇది వరకు పటాన్ చెరువు తాజా మాజీ శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు అప్పట్లో మాత్రం ఆయన నివాసం నుంచి కీలకమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లినా.. ఇప్పటి వరకు మాత్రం ఆయనపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోలేదని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more