నిండు సభలో ప్రధాన మంత్రిని ఒక ప్రతిపక్ష నేత వచ్చి కౌగిలించుకోవడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి కాగా, దీనిపై ఒక్కక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీవి పిల్లచేష్టలని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే.. రాహుల్ తన మదిలో ఎలాంటి విద్వేషం లేదని ఈ ఆలింగనం ద్వారా రుజువు చేశారని మరికొందరు పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనిపై బీజేపి అధికార ప్రతినిధి తేజిందర్ సింగ్ మాత్రం మరో వాదనను తెరపైకి తీసుకువచ్చాడు.
రాహుల్ అలా కౌగించుకోవడం వెనుక ఓ తాంత్రికుడు ఉన్నాడని ఆయన చెప్పడం వల్లే రాహుల్ ఇలా చేశాడని.. రాహుల్ చర్యను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశాడు. బీజేపి అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ బగ్గా ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘నువ్వు ప్రధాని కావాలని అనుకుంటున్నట్లయితే.. సభలో నీ ప్రసంగం అయిపోయిన తరువాత ప్రధాని కుర్చీ వద్దకు వెళ్లి దానిని తాకాలని ఓ తాంత్రికుడు రాహుల్ గాంధీకి సూచించాడట. ఈ విషయాన్ని తనకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ చెప్పాడని పేర్కొన్నారు. ఆ కుర్చీ కోసమే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారని విమర్శించారు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే.. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసానికి ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలపడంతో స్పీకర్ దీనికి ఆమోదం తెలిపారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. మునుపెన్నడూ లేని రీతిలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రసంగం ముగిశాక... ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఈ చర్యతో సభలోని సభ్యులంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. దీంతో నెట్ జనులు మాత్రం తమకు ఇష్టనుసారంగా రెచ్చిపోతే.. నవ్వులు అపుకోలేని విధమైన ట్వీట్లు చేస్తున్నారు. తేజిందర్ పాల్ ను లక్ష్యంగా చేసుకుని ట్రాల్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more