ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జార్ఖండ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాంచీకి 365 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్ లో ఓ కార్యక్రమానికి హాజరవడానికి అగ్నివేష్ వచ్చారు. హోటల్ నుంచి ఆయన బయటకు వస్తుండగా విల్లంబులు ధరించిన గిరిజనులు ఆయనకు భద్రతగా ఉన్నారు. ఇంతలోనే అక్కడకు ఒక్కసారిగా వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఆయనను చితకబాదారు. కిండపడేసి కొట్టారు. నల్ల జెండాలు చూపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైశ్రీరాం అంటూ ఆయనపై దాడి చేశారు.
ఘటన అనంతరం స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ, ఎలాంటి హింసకైనా తాను వ్యతిరేకమని చెప్పారు. తనపై ఎందుకు దాడి చేశారో తనకు తెలియదని చెప్పారు. దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను కోరానని తెలిపారు. తనపై దాడి జరిగిన సమయంలో చుట్టుపక్కల ఒక్క పోలీసు కూడా లేరని అన్నారు. బయట బీజేవైఎం కార్యకర్తలు తన కోసం వేచి ఉన్నారనే విషయాన్ని తాను హోటల్ లో ఉన్నప్పుడే తన స్నేహితులు తనకు చెప్పారని తెలిపారు.
కూర్చొని మాట్లాడుకుందాం రండని వారిని తాను ఆహ్వానించానని... కానీ ఒక్కరు కూడా రాలేదని చెప్పారు. ఒక సెమినార్ లో పాల్గొనేందుకు తన గిరిజన మిత్రులతో కలసి వెళ్తుండగా, దాడి చేశారని తెలిపారు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే దాడికి దిగారని చెప్పారు. పిడికిళ్లతో గుద్దుతూ, కొడుతూ, రోడ్డుపై పడేసి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన పదజాలాన్ని తనపై ఉపయోగించారని చెప్పారు. దాడిలో గాయపడ్డ స్వామి అగ్నివేష్ కు స్థానిక ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అగ్నివేష్ పై జరిగిన దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని భావిస్తున్నారు. దాడికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more