బిగ్ బి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులతో నిత్యం తన సోషల్ మీడియా ద్వారా అందుబాటులో వుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో అనవసర విషయాలను ప్రాథాన్యం ఇవ్వడం అసలు ఇష్టంలేని అమితాబ్.. ఆ మధ్య ముంబైలో తన మిత్రుడి అంత్యక్రియలకు హాజరుకాగా, అక్కడ కూడా అభిమానులు విషాదవాతవరణాన్ని కాదని, ఫోటోలకు, సెల్పీలను కోరడంతో ఆయన అవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా సెల్ ఫోన్లు, సోషల్ మీడియా ఎలాంటి ప్రభావాన్ని చాటుతుందో అని చెప్పడానికి ఆయన తన ఇంటిసభ్యుల ఫోటోనే ఒకటి ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారడంతో పాటు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుత సమాజంలో కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయానికి ఇది అద్దం పడుతోంది. అందరి చేతా ‘ఔరా’ అనిపించే ఈ ఫొటోకు ఇప్పటికే లక్షలాది లైకులు వచ్చాయి.
అమితాబ్ షేర్ చేసిన ఫొటోలో ఆయన కుటుంబం అంటే.. చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా, అభిషేక్ బచ్చన్, మనవళ్లు నవ్యా నావెలి నందా, అగస్త్య తదితరులు ఉన్నారు. ఇందులో విశేషం ఏంటని అంటారా.. అందరూ ఒకే హాల్లో ఒకరికి ఒకరు అందేంత దూరంలో కూర్చున్నా.. రూములో అంతమంది ఉన్నా ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కారణం.. ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఉంది. అందరూ అందులోనే మునిగిపోయారు. తదేక దీక్షతో మొబైల్ ను ఆపరేట్ చేస్తూ ప్రపంచాన్ని మైమరచిపోయారు. దీంతో ‘‘అందరూ ఒక చోటే ఉన్నారు. వారితో ఫోన్లు కూడా ఉన్నాయి’’ అంటూ అమితాబ్ తన ఫొటోకు క్యాప్షన్ రాశారు. ఈ ఫోటోలో అందరూ స్మార్ట్ ఫోన్ లో మునిగిపోతే ఒక్క నవ్య ఒక్కర్తే పుస్తకం చదువుతూ కూర్చోవడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more