టీవి నటిగా రాష్ట్రంలోని అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుని సెలబ్రిటీగా మారిన ఓ నటి.. తాను వారికి ఆదర్శంగా నిలవాల్సిందిపోయి.. అక్రమ మార్గాలను అందుకుని తాను సంపాదించిన పేరు ప్రఖ్యాతులను ఒక్క ఘటనతో గంగలో కలిపేసింది. రాత్రికి రాత్రే తాను సంపన్నురాలు కావాలని భావించిన నటి.. ఏకంగా తన ఇంట్లోనే నకిలీ నోట్ల ముద్రణను చేపట్టింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నటితో పాటు అమె తల్లి రీమా దేవిం, సోదరి శృతిలను కూడా అరెస్టు చేసిన పోలీసులు ముగ్గురునీ కటకటాల వెనక్కి పంపారు
రూ.57 లక్షల దొంగ నోట్లు పట్టుబడిన కేసులో తీగ లాగితే ముద్రించిన కేసులో వీరిని అరెస్టు చేశారు. కొల్లంలోని తమ ఇంటిలో దొంగ నోట్లు ముద్రించిన వీరిని కొచ్చిలో అరెస్టు చేసినట్లు ఇడుక్కి జిల్లా పోలీసు అధికారి కేబీ వేణుగోపాల్ చెప్పారు. వారిని జిల్లాలోని కొట్టపనకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా నటి తల్లిని అనుమానిస్తున్నట్లు చెప్పారు.‘కొల్లంలోని రీమా దేవి ఇంటిపై అంతస్తులో నకిలీ నోట్ల ముద్రణ జరుగుతోంది. దొంగ నోట్లు ముద్రించేందుకు రూ.4.36 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు.
ఇక నకిలీ నోట్లు ముద్రణ లాభాల్లో కూడా తమకు సగం వాటా ఇవ్వాలని ఆమె పలువురితో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.57 లక్షల విలువైన దొంగ నోట్లను ఆ ఇంట్లో గుర్తించి సీజ్ చేశాం. ఈకేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని త్వరలో పట్టుకుంటామని వేణుగోపాల్ తెలిపారు. మూడు రోజుల క్రితం ఇడుక్కిలోని అన్నకరాయిలో రూ.2.25 లక్షల నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వీరు నటి సూర్య శశికుమార్, ఆమె సోదరి, తల్లి పేర్లను బయటపెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more