ప్రపంచంలోని పలు దేశాల్లో బహిరంగ శృంగారం నేరం కాదు. కానీ మన దేశంలో మాత్రం అది నేరమే. అయితే ఎక్కడనుంచి వచ్చారో కానీ ఓ విదేశీ జంట ఏకంగా ముంబైలో నడిరోడ్డుపై పబ్లిక్ గా శృంగారానికి తెరలేపారు. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే మెరైన్ డ్రైవ్ రోడ్డులో నిర్మాణ్ పాయింట్ వద్ద డివైడర్ నే పడక గదిగా మార్చుకున్న జంట.. నడిరోడ్డుపై శృంగారానికి పాల్పడ్డారు. ప్రపంచంతో తనకు సంబంధం లేదన్నట్టుగా.. తన చుట్టూ వున్న పబ్లిక్ కూడా పట్టించుకోకుండా శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయారు. పబ్లిక్ గా ముద్దుపెట్టుకుంటూ తాను అర్థనగ్నంగా మారిన విదేశీయుడు.. యువతిని కూడా అర్థనగ్నంగా మార్చి నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించాడు.
అటుగా వెళ్లే వారంతా ఈ దృశ్యాన్ని సినిమా చూస్తున్నట్టు చూశారు. కొందరు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. అయితే కొందరు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించి.. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన విదేశీ జంట అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు చేతులు కాలక అకులు పట్టుకున్నట్లు అప్పుడే వారిని పట్టుకోవాల్సిందిపోయి.. వారు జారుకున్నాక అదికాస్తా వైరల్ గా మారడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
అయితే పోలీసుల అన్వేషణలో పరారీలో ఉన్న యువతి పట్టుబడింది. యువకుడు రష్యా నుంచి వచ్చినట్టు గుర్తించి అతడి కోసం ఇంకా అన్వేషణ సాగిస్తున్నారు పోలీసులు. కాగా పోలీసుల విచారణలో యువతి పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుండడంతో ఆమె మానసిక స్థితి సరిగా లేనట్టు గుర్తించారు. ఓసారి తాము గోవా నుంచి వచ్చామని, మరోసారి రష్యా అని, జెనీవా అని చెబుతున్నప్పటికీ ఆహార్యాన్ని బట్టి ఆమె భారతీయురాలేనని తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. యువతిని చెంబూరులోని మహిళా సురక్షా కేంద్రానికి తరలించినట్టు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more