తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని నడిరోడ్డులో బద్దిచెప్పింది భార్య. తనను నిర్లక్ష్యం చేస్తున్న భర్తను అనేక పర్యాయాలు వేడుకున్నా.. ఆయన పద్దతిలో మార్పు కానరాకపోవడంతో భార్య తన భర్తసహా అతని ప్రియురాలని నడిరోడ్డుపై పట్టుకుంది. భర్త ప్రియురాలిపై దాడి చేసింది. తన భర్తతో అక్రమసంబంధం పెట్టుకుంటావా.? అంటూ ఆగ్రహంతో రమాదేవి అనే మహిళ ఊగిపోయింది. స్థానికులు అమెను నిలువరించి ఇద్దరనీ పోలీసులకు అప్పగించారు.
అయితే భర్త మాత్రం తన ప్రియురాలికే మద్దతు పలికాడు. తన భార్య తనను హత్య చేయాలని చూస్తుందని అరోపించాడు. విజయవాడలోని నడిరోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకు చెందిన సురేష్ కుమార్ నగరంలోని సన్ రైజ్ ఆసుపత్రిలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అతనికి 9 సంవత్సరాల క్రితం రమాదేవితో వివాహం అయింది. అయితే ఉద్యోగం రిత్యా విజయవాడకు వచ్చి వుంటున్నారు.
ఈ క్రమంలో గత కొంత కాలంగా సురేష్ తనను పట్టించుకోవడం లేదని, అందుకు మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడమే కారణమని ఆరోపించిన రమాదేవి, ఇదే విషయాన్ని పోలీసులకూ ఫిర్యాదు చేసింది. అయినా భర్త పరిస్థితి మారకపోవడంతో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి రంగంలోకి దిగింది. గత రాత్రి సురేష్ కుమార్, సదరు యువతి కలిసుండగా పట్టుకుని దాడి చేసింది. స్థానికులు రమాదేవిని నిలువరించి, ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తనకు న్యాయం చేయాలని రమాదేవి కోరుతుండగా, రమాదేవి తనను హత్య చేయాలని చూసిందని, కావాలనే నిందలు వేస్తోందని సురేష్ ఆరోపిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more