రెండున్నరేళ్ల క్రితం బిహార్ లోని ఓ పరీక్షా కేంద్రంలో అక్కడి విద్యార్థులు పరీక్షల నేపథ్యంలో మాస్ కాపీయింగ్ కు పాల్పడితే బీజేపి రాష్ట్ర నేతలు అనేక విమర్శలు చేసిన విషయం తెలిసిందే. యావత్ దేశానికి గుజరాత్ మోడల్ అంటూ చూపించి అధికారంలోకి వచ్చిన ప్రధాని తన సొంత రాష్ట్రంలో పరీక్షల సందర్భంగా జరుగుతున్న వైనాన్ని మాత్రం చూడలేకపోతున్నారా.? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అంతేనా లేక ఇది కూడా దేశానికి గుజరాత్ మోడలేనా అన్న అనుమానాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఓ పరీక్షా కేంద్రంలో జరిగిన మోసాన్ని కిలోలతో సహా బయటపెట్టారు అక్కడి అధికారులు. అయితే అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేతులు కాలకైనా ఆకులు పట్టుకున్నారన్నవారు కూడా లేకపోలేరు. కేవలం ఒక్క పరీక్షలో ఓ ఎగ్జామ్ సెంటర్ నుంచి 200 కిలోల చిట్టీలు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ లోని జునాగఢ్ జిల్లా వంథాలీలో ఇటీవల జరిగిన 12వ తరగతి సైన్స్ పరీక్ష సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చీటీల్లో కనిపించీ కనిపించనంత చిన్న అక్షరాలతో సమాధానాలు ఉన్నాయి.
వీటిని తరలించేందుకు బోర్డు అధికారులు 20 గోనెసంచులు వాడాల్సివచ్చింది. గుజారాత్ బోర్డు ఎగ్జామినేషన్ కమిటీ విచారణ సందర్భంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించిన సిబ్బందితో పాటు, ఎగ్జామ్ కోఆర్డినేటర్ కు సైతం సమన్లు జారీచేయాలని నిర్ణయించారు. డీఈవో బీఎస్ కెల్లా మాట్లాడుతూ... ‘‘స్వామి నారాయణ్ గురుకుల్ పరీక్షా కేంద్రంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ మాకు సమాచారం వచ్చింది. మార్చి 14న మేము పరీక్షా కేంద్రానికి వెళ్లే సరికి టెన్త్ పరీక్ష జరుగుతోంది.
చిన్న చిన్న కాగితాలతో అక్కడి రోడ్లన్నీ నిండిపోయాయి. అవన్నీ ఇంతకు ముందే విద్యార్దులు వదిలిపెట్టిన కాపీల తాలూకు చిట్టీలే..’’ అని వెల్లడించారు. దీంతో 12వ తరగతి విద్యార్ధులందర్నీ తమ వద్ద ఉన్న చిట్టీలన్నీ వెనక్కి ఇచ్చేయాలని హెచ్చరించామన్నారు. దాదాపు మూడుసార్లు హెచ్చరించిన తర్వాత అందరూ తమ చీటీలను ఇచ్చేశారనీ.. తనిఖీలు చేసిన తర్వాత ఇంకో 15 మంది చీటీలను ఇవ్వకుండా దొరికి పోయారని కెల్లా పేర్కొన్నారు.. దీంతో ఆ 15 మందితో పాటు కేసు నమోదైన కోఆర్డినేటర్లు, సూపర్వైజర్లకు సమన్లు జారీ చేయనున్నట్టు బోర్డు వైస్ చైర్మన్ ఎన్సీ షా పేర్కొన్నారు. విద్యార్ధులు ఇచ్చినవిగానీ, అధికారులు స్వాధీనం చేసుకున్నవిగానీ మొత్తం 200 కిలోల చిట్టీలు అయ్యాయని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more