కర్ణాటకలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు.. ప్రలోభాలు.. వాటికి సంబంధించిన అడియో టేపులు కూడా వెలుగులోకి రావడంతో.. తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవినీతి కనబడకుండా చేస్తాం అని ప్రగల్భాలు పలికే ప్రధాని.. అవినీతిపై గంటల తరబడి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే ప్రధాని.. ఇప్పుడు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో బీజేపి ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేస్తున్నది ఏమీటి.. బీజేపి శ్రేణుల అధ్వర్యంలో జరుగుతున్నది ఏమిటి? అని ప్రశ్నించారు.
ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సిద్ధరామయ్య విరుచుకు పడ్డారు. ఈ సమయంలో.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా యడ్యూరప్పను, బీజేపీ నేతలను అడ్డుకొనే నైతిక విలువలు మోదీకి ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. మోదీజీ... కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సుస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తారా? అని పేర్కొన్నారు. ఇకపై ప్రధాని రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమాలలో, ఎన్నికల ప్రచార సభల్లో.. ఇలా అవకాశం కల్పించే ఏ వేదికపైన కూడా అవినీతి గురించి మాట్లాడకూడదని ఆయన సూచించారు.
సొంత పార్టీ నేతలు, బీజేపి శ్రేణులు, అందరూ కలసి కర్ణాటకలోని ఎమ్మెల్యేలతో బేరసారాలు అడుతున్న టేపులు కన్నడ రాష్ట్ర ప్రజలు చూశారని, ఒక్కో ఎమ్మెల్యేకు వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తామని బేరాలు కుదుర్చుకుంటున్నారని, ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. దీనికి తోడు మంత్రి పదవులు కూడా ఇస్తామని బేరాలు కుదుర్చుకుంటున్నారు. వారికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బీజేపి అధ్వర్యంలో ఇంత పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నా ప్రధానికి మాత్రం కనబడదని సిద్దరామయ్య వ్యంగస్త్రాలు సంధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more