మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపునకు జోధ్పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు దోషులకు 20ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. జోధ్పూర్ సెంట్రల్ జైలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలో ఈ కేసుకు సంబంధించిన తుది విచారణ జరగ్గా.. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ మధుసూదన్ శర్మ ఈ తీర్పు వెల్లడించారు. ఆశారాంకు జీవిత ఖైదు విధించడంతో ఆయన తన మిగతా జీవితం మొత్తం జైలులోనే గడపాల్సి ఉంటుంది.
ఆశారాంకు కనీస శిక్ష మాత్రమే విధించాలని ఆశారాం తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించినా.. న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయిస్తామని ఆశారాం అధికార ప్రతినిధి తెలిపారు. ఆశారాం కేసు తొలుత న్యాయస్థానంలోనే విచారణ జరపాలని భావించినా.. గుర్మీత్ బాబాపై తీర్పు నేపథ్యంలో చోటుచేసుకున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకొని విచారణను జోధ్పూర్ జైలు ప్రాంగణంలో చేపట్టాలని రాజస్థాన హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి గత నాలుగేళ్లుగా ఆశారాం ఇదే జైలులో ఉంటున్నాడు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జోధ్పూర్ జైలు సహా రాజస్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని షాహజాన్ పూర్ కు చెందిన అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద ఏడుగురు పోలీసులతో రక్షణ కల్పించారు.
మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2013 సెప్టెంబరు 1న ఆశారాంను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 7నే వాదనలు పూర్తికాగా.. ఇవాళ తుది తీర్పు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more