మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో కూడా మరో అరుమంది మావోయిస్టులు అసువులు బాసారు. గడ్చిరోలి జిల్లాలోని కాండ్ల రాజారాం ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో అహేరీ తాలూకాలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో అహేరి దళ కమాండర్ నందు ఉన్నట్లు సమాచారం. భద్రతా బలగాలు మావోయిస్టుల మృతదేహాలను అహేరికి తరలించారు. దీంతో మొత్తంగా పోలీసుల చేతిలో మరణించిన మావోల సంఖ్య 37కు చేరింది.
ఇక క్రితం రోజున జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు నక్సల్స్ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ లో ఇదరు దళ నేతలతో సహా 16 మంది మావోలు మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్ గట్ట ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్ షెలార్ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం ఆరుగురు మరణించారని చెప్పారు. కాగా, ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మరికొన్ని నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కూంబింగ్ ఆపరేషన్కు భారీ వర్షాలు అడ్డంకిగా మారాయని ఐజీ తెలిపారు.
మందుపాతర పేలి ముగ్గురు మృతి ఒడిశా రాష్ట్రంలోని నబరంగపూర్ జిల్లా రాయ్గర్ సమితి అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతర ప్రమాదవశాత్తూ పేలడం వల్లే ఈ దుర్ఘటన సంభవించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మరో ఘటనలో చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. సుకుమా జిల్లాలోని పూసుపాల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more