తనపై తమ ప్రజాప్రతినిధి తన సొదరుడితో కలసి అత్యాచారం చేశాడని అరోపిస్తూ.. ముఖ్యమంత్రి ఇంటి ఎదుట అత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బాధిత యువతి పిర్యాదుపై పట్టని పోలీసులు అమె తంత్రిని మాత్రం కుట్ర, ఉద్దేశపూర్వకంగా అప్రతిష్ట పాలు చేయడం వంటి అరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని అన్యాయంగా పోట్టనపెట్టుకున్నారు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పోలీసుల లాకప్ డెత్ చేశారని అరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, ఆయన సోదరులు ఏడాది క్రితం తనపై అత్యాచారం చేశారంటూ.. అప్పటి నుంచి తాను ప్రతీ ఒక్క అధికారికి వారిపై పిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అరోపిస్తూ ఓ యువతి ఏకంగా లక్నోలోని ముఖ్యమంత్రి అధికార నివాసం ఎదుటకు కుటుంబసభ్యులతో చేరుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పోలీసులు అప్రమత్తతో వ్యవహరించిన యువతని కాపాడారు. అమె కేసును విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
అయితే అమె తండ్రిని వున్నావ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..అతనిపై అధికారికంగా కుట్ర కేసును నమోదు చేసి.. విచారించారు. పోలీసు మార్కు విచారణలో వారి దెబ్బలకు తాళతేక బాధితురాలి తండ్రి పోలీసుల కస్టడీలో మృతి చెందారు. దీంతో వున్నావ్ సహా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధితురాలికి ఇదేనా బీజేపి ప్రభుత్వం చేసే న్యాయమని పలు ప్రజాసంఘాలు కూడా నిలదీస్తున్నాయి. అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేయమంటే ఏకంగా ఆమె తండ్రి ఉసురుతీస్తారా.? అని ప్రశ్నిస్తున్నాయి.
దీంతో కేసును పక్కదారి పట్టించే పనిలో వున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ నెనగర్ ను కాకుండా అతని సోదరుడు అతుల్ సెనిగర్ తో ఈ కేసులో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదివారం వరకు విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్న అధికారులు.. బాదితురాలి చనిపోవడంతో హుటాహుటిన ఎలాంటి దర్యాప్తు లేకుండా నిందితులను ఎలా అరెస్టు చేశారన్న ప్రశ్నలకు కూడా ఉదయిస్తున్నాయి.
ప్రభుత్వం కావాలనే ఈ కేసు విషయంలో తాత్సారం చేసిందని.. దీంతోనే బాధితురాలు తన తండ్రిని కొల్పోయిందని గ్రామస్థులు అరోపిస్తున్నారు. ఏడాదిగా తన బాధిత కూతురికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించేందుకు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు ఎంతో వ్యవప్రయాసలు ఓర్చి అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగినా అతన్ని పోట్టనబెట్టుకున్న తరువాతే కేసు నమోదైందని అవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం స్పందించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు ఆరుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more